VC Sajjanar : సజ్జనార్ లాస్ట్ వర్కింగ్ డే సాధారణ ప్రయాణం.. అందరూ షాక్..!
- ప్రజా రవాణాపై సజ్జనార్ అనుబంధం
- ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణం
- రాష్ట్రంలో కీలక అధికారుల బదిలీలు
- హైదరాబాద్ కమిషనర్గా సజ్జనర్ బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjnar : తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, పలువురు కీలక అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పటివరకు పనిచేసిన వీసీ సజ్జనార్, తన పదవీకాలంలో చివరి రోజును సాధారణ ప్రజల మాదిరిగానే గడిపారు. ప్రజా రవాణాపై తనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ, సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. హైదరాబాద్ లక్డీకాపుల్లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి 113 I/M రూట్ బస్సులో ఎక్కి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్ భవన్ వరకు ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా యూపీఐ ద్వారా చెల్లింపు చేసి కండక్టర్ వద్ద నుంచి టికెట్ తీసుకున్నారు. ప్రయాణంలో సహ ప్రయాణికులతో ముచ్చటిస్తూ, వారి అనుభవాలు, సమస్యలు, ఆర్టీసీ రవాణా సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Kakinada: కాకినాడలో జనసేన వీర మహిళల అసహనం
Also Read
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
- OTR : సమస్యలు పరిష్కరించాల్సిన కేఆర్ఎంబీ చేతులెత్తేసిందా? ఏపీ-తెలంగాణ నీటి వివాదంపై ప్రశ్నలు
- Kishan Reddy : జీవో 97పై బీజేపీ ఫైర్.. విద్యార్థులకు అండగా కిషన్ రెడ్డి.!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం, పలువురు కీలక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానచలనం జరిగింది. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణ, పోలీస్ వ్యవస్థ బలోపేతం, ట్రాఫిక్ నియంత్రణ వంటి విభాగాలపై దృష్టి సారించేందుకు కొత్త నియామకాలు చేపట్టబడ్డాయి. హైదరాబాద్ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ ను నియమించారు. అక్టోబర్ 1న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీసీ సజ్జనార్ పేరు చెప్పగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది.. ఆయన క్రమశిక్షణ, శాంతిభద్రతల పట్ల చూపే కట్టుదిట్టమైన వైఖరి.
ఐపీఎస్ అధికారి హోదాలో పలు కీలక విభాగాల్లో పనిచేసిన ఆయనకు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తిరిగి స్వీకరించడం, సిటీ శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు, సైబర్ క్రైమ్ నియంత్రణ వంటి అంశాల్లో ఆయనపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. తన చివరి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సాధారణ ప్రజలతో కలసిపోవడం ద్వారా సజ్జనార్ ఇచ్చిన సందేశం స్పష్టమే – ఏ పదవిలో ఉన్నా ప్రజలతో అనుబంధం కొనసాగుతుందని. హైదరాబాద్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టబోయే సందర్భంలో, ప్రజల మధ్య సాన్నిహిత్యం ఆయనకు మరింత బలం చేకూర్చనుంది.
Donald Trump: డూ ఆర్ డై గేమ్ ఆడుతున్న ట్రంప్.. గెలిస్తే నోబెల్ పక్కా అంటా!
తాజావార్తలు
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
-
Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
-
Nepal Floods: విషాదం వేళ అమానవీయం.. మృతదేహాలపై ఆభరణాలు చోరీ
-
Nepal Floods: వరదల్లోనూ సిలిండర్ల కోసం నేపాలీల ఆరాటం.. ప్రాణాలను పణంగా పెట్టేంత గ్యాస్ కొరత ఎందుకు..?
-
Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!