VC Sajjanar : సజ్జనార్ లాస్ట్ వర్కింగ్ డే సాధారణ ప్రయాణం.. అందరూ షాక్..!
- ప్రజా రవాణాపై సజ్జనార్ అనుబంధం
- ఆర్టీసీ బస్సులో సాధారణ ప్రయాణం
- రాష్ట్రంలో కీలక అధికారుల బదిలీలు
- హైదరాబాద్ కమిషనర్గా సజ్జనర్ బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
VC Sajjnar : తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, పలువురు కీలక అధికారులు బదిలీ అయ్యారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా ఇప్పటివరకు పనిచేసిన వీసీ సజ్జనార్, తన పదవీకాలంలో చివరి రోజును సాధారణ ప్రజల మాదిరిగానే గడిపారు. ప్రజా రవాణాపై తనకున్న అనుబంధాన్ని వ్యక్తం చేస్తూ, సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. హైదరాబాద్ లక్డీకాపుల్లోని టెలిఫోన్ భవన్ బస్టాండ్ నుంచి 113 I/M రూట్ బస్సులో ఎక్కి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్ భవన్ వరకు ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా యూపీఐ ద్వారా చెల్లింపు చేసి కండక్టర్ వద్ద నుంచి టికెట్ తీసుకున్నారు. ప్రయాణంలో సహ ప్రయాణికులతో ముచ్చటిస్తూ, వారి అనుభవాలు, సమస్యలు, ఆర్టీసీ రవాణా సదుపాయాలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.
Kakinada: కాకినాడలో జనసేన వీర మహిళల అసహనం
Also Read
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
- Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
- Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
- Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం, పలువురు కీలక ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్థానచలనం జరిగింది. ముఖ్యంగా శాంతిభద్రతల నిర్వహణ, పోలీస్ వ్యవస్థ బలోపేతం, ట్రాఫిక్ నియంత్రణ వంటి విభాగాలపై దృష్టి సారించేందుకు కొత్త నియామకాలు చేపట్టబడ్డాయి. హైదరాబాద్ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ ను నియమించారు. అక్టోబర్ 1న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీసీ సజ్జనార్ పేరు చెప్పగానే రాష్ట్ర ప్రజలకు గుర్తొచ్చేది.. ఆయన క్రమశిక్షణ, శాంతిభద్రతల పట్ల చూపే కట్టుదిట్టమైన వైఖరి.
ఐపీఎస్ అధికారి హోదాలో పలు కీలక విభాగాల్లో పనిచేసిన ఆయనకు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తిరిగి స్వీకరించడం, సిటీ శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యలు, సైబర్ క్రైమ్ నియంత్రణ వంటి అంశాల్లో ఆయనపై పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. తన చివరి రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సాధారణ ప్రజలతో కలసిపోవడం ద్వారా సజ్జనార్ ఇచ్చిన సందేశం స్పష్టమే – ఏ పదవిలో ఉన్నా ప్రజలతో అనుబంధం కొనసాగుతుందని. హైదరాబాద్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టబోయే సందర్భంలో, ప్రజల మధ్య సాన్నిహిత్యం ఆయనకు మరింత బలం చేకూర్చనుంది.
Donald Trump: డూ ఆర్ డై గేమ్ ఆడుతున్న ట్రంప్.. గెలిస్తే నోబెల్ పక్కా అంటా!
తాజావార్తలు
-
Fauji: ఇన్స్టాగ్రామ్ను షేక్ చేసిన ప్రభాస్.. ‘ఫౌజీ’ ఫస్ట్ లుక్తో ఆల్టైమ్ రికార్డు!
-
Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?