Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uttam Kumar Reddy Fires On Pm Narendra Modi

Uttam Kumar Reddy: మోదీజీ.. మీకు 2022 సంవత్సరం ఇంకా రాలేదా?

Published Date :August 17, 2022 , 7:34 pm
By NTV WebDesk
Uttam Kumar Reddy: మోదీజీ.. మీకు 2022 సంవత్సరం ఇంకా రాలేదా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Uttam Kumar Reddy Fires On PM Narendra Modi: గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తాను ఇచ్చిన వాగ్దానాలను ఇంతవరకూ నెరవేర్చనందుకు మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. 2016లో చేసిన ప్రసంగంలో భాగంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని.. అలాగే అందరికీ ఇల్లు ఇవ్వడంతో పాటు దేశమంతటికీ విద్యుద్దీకరణ చేస్తామని మోదీ హామీ ఇచ్చిన విషయాన్ని ఉత్తమ్ కుమార్ గుర్తు చేసుకున్నారు. అయితే.. 2022 వచ్చినా ఆ వాగ్ధానాల్లో ఏ ఒక్కటి పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. మోదీకి 2022 సంవత్సరం ఎప్పుడు వస్తుందో, 2022 నాటికి పూర్తి చేస్తానని తానిచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో వివరించాలని నిలదీశారు. బూటకపు వాగ్దానాలు చేసేందుకు గత ఎనిమిదేళ్ల నుంచి మోదీ స్వాతంత్ర దినోత్సవాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

2016 నుంచి రైతుల సాగు ఆదాయం ఏమాత్రం పెరగలేదని.. గత ఎనిమిదేళ్లలో ఇన్‌పుట్‌ ​​ఖర్చు రెండింతలు పెరిగిందని ఉత్తమ్ కుమార్ అన్నారు. 2014లో మాదిరిగానే రైతులు ఆదాయం ఇప్పటికీ సగటున రోజుకు రూ. 27 ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల పంట నష్టం వాటిల్లిందని.. అనేక పంటలకు సరైన మద్దతు ధరలు లేకపోవడంతో, సాగులో నష్టపోయి వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. గత కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తే, ప్రస్తుత మోదీ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యల వివరాలను దాచిపెట్టేందుకు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నుంచి డేటాను విడుదల చేయడం మానేసిందన్నారు. రైతులను మోసం చేయడంలో ప్రధాని మోదీని తెలంగాణ సీఎం కేసీఆర్ అనుకరిస్తున్నారని ఆరోపించారు. పంట రుణాలు మాఫీ చేస్తామన్న హామీని ఇంతవరకూ అమలు చేయలేదని, తెలంగాణలో ఒక్క రైతుకు కూడా పంటల బీమా వర్తించని విధంగా తప్పుడు విధానాలు అమలు చేశారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా రైతుల ఆత్మహత్యల లెక్కలను చూపడం లేదని ఆరోపణలు చేశారు.

Also Read

  • Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత
  • Labour Cards: శుభవార్త.. అర్హులైన ప్రతి ఒక్కరికీ లేబర్ కార్డులు..
  • Karimnagar PMJ Jewellery : పీఎంజే జ్యువెల్లరీ దొంగల ఫోటోలు విడుదల.. ఆచూకీ చెబితే లక్ష నజరానా.!
  • Unusual Weather : తెలుగు రాష్ట్రాల్లో భిన్నవాతావరణం... పగలు సెగలు..సాయంత్రం జల్లులు

2022లో అందరికీ ఇల్లు ఇస్తామని మోదీ చేసిన హామీని గుర్తు చేస్తూ.. 60 లక్షల మందిలో 50% మందికి కూడా ఇల్లు ఇవ్వలేదన్న నిజాన్ని, పీఎం ఆవాస్ యోజన వెబ్‌సైట్‌లో ఉన్న డేటా చెబుతోందని ఉత్తమ్ తెలిపారు. మోదీలాగే కేసీఆర్ కూడా ఇల్లు ఇస్తామన్న హామీని మరిచారని, మంజూరైన 2.75 లక్షల 2BHK యూనిట్లలో 10% కూడా నిర్మించలేదన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్డి వంటి మౌలిక వసతులు కల్పిస్తామన్న హామీని నెరవేర్చడంలో ప్రధాని మోదీ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూర్వీకుల గ్రామమైన ఒడిశాలోని ఉపర్‌బేడకు.. ఈ ఏడాది జూన్‌లో ఆమె నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాతే తొలిసారిగా విద్యుత్‌ సౌకర్యం లభించిందని తెలిపారు. 2022 నాటికి ‘పౌష్టికాహార లోప రహిత భారతదేశం’ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రధాని మోదీ 2018లో ‘పోషణ్’ అభియాన్‌ను మోదీ ప్రారంభించారని.. కానీ అందులో ఎలాంటి మెరుగుదల లేదన్నారు. దానికి బదులు 13 రాష్ట్రాల్లో పోషకాహార లోపం కేసులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో మన భారతదేశం.. శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకబడి ఉందన్నారు.

‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మ నిర్భర్ భారత్’ వంటి ఆకర్షణీయమైన నినాదాలతో ప్రధాని మోదీ ప్రజలను మోసం చేశారని ఉత్తమ కుమార్ విమర్శించారు. ఇప్పుడు మాట్లాడుతున్న ‘అమృత్ కల్’ని విశ్లేషిస్తే.. 2047 లక్ష్యాలను నిర్దేశిస్తున్నారని అర్థమవుతోందన్నారు. తన ప్రసంగాల్లో అవినీతి గురించి మాట్లాడే మోదీ.. మోసగాళ్లపై మాత్రం చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉంటున్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో బ్యాంకు మోసాలు రూ. 5.35 లక్షల కోట్లు జరిగాయన్నారు. విజయ్ మాల్యా, మెహుల్ చౌకాసీ, నీరవ్ మోదీ వంటి మోసగాళ్లను పట్టుకోకుండా.. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడం కోసం ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ఏజెన్సీలను మోదీ ఉపయోగిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని, స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగాన్ని రాజకీయం చేయడం ద్వారా ప్రధాని మోదీ రాజకీయ దౌర్భాగ్యానికి పాల్పడ్డారన్నారు. అలాగే బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, హత్య దోషుల్ని విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. వారికి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలకడం చాలా సిగ్గుచేటని.. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని ఉత్తమ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bilkis Bano Convicts
  • PM Narendra Modi
  • telangana Congress
  • Uttam Kumar On Modi
  • uttam kumar reddy

తాజావార్తలు

  • Allu Arjun Fans: జూన్ 4న అల్లు అర్జున్ ఫ్యాన్స్ సౌత్ ఇండియా మీటింగ్

  • Bitcoin Hits New Record: సరికొత్త రికార్డుకు బిట్‌కాయిన్ ధర.. 80 వేల డాలర్ల మార్కు దాటిన క్రిప్టో!

  • West Bengal CM: బెంగాల్ సీఎం రేసులో ఆ నలుగురు.. చరిత్ర తిరగరాసేది ఎవరో..?

  • PM Modi: బెంగాల్ ఫలితం దేశ ఉజ్వల భవిష్యత్‌కు నాంది.. విజయోత్సవ ప్రసంగంలో మోడీ కీలక వ్యాఖ్యలు

  • Viral: ఒక్క రాత్రి నగ్న పూజకు కూర్చొంటే రూ.30 లక్షలు.. యువతికి ఎర వేసిన కారు డ్రైవర్..

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions