Assault on Cab Driver: క్యాబ్ డ్రైవర్పై దాడి.. నిందితులను తప్పించే ప్రయత్నం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అరగంట ఆలస్యం అయిందని ఓ క్యాబ్ డ్రైవర్ వెంకటేశ్ను చితకబాదిన ఘటనపై కొత్తకోణం వెలుగు చూసింది. దాడి చేసిన మరికొందరిని తప్పించడానికి వివిధ పార్టీల పెద్దలు రంగంలోకి దిగి రాయబారం చేస్తున్నట్లు సమాచారం. వెంకటేశ్ దాడి అనంతరం వివేక్రెడ్డి పోలీసులకు లొంగిపోయాడని, రాజేంద్రనగర్ పోలీసులు రెండ్రోజులు విచారించి సోమవారం తిరిగి రిమాండ్కు తరలించారని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన 12 మంది పేర్లను నిందితుడు వివేక్రెడ్డి చెప్పినట్లు తెలిపారు. అయితే సీసీ ఫుటేజీలో సుమారు 20 మంది వరకు దాడి చేస్తున్నట్లు కనిపిస్తోంది. దాడిలో కొన్ని పుటేజీలను పోలీసులకు దొరక్కుండా చూస్తున్నారని బాదితులు ఆరోపిస్తున్నారు.
వెంకటేశ్ తల్లి దండ్రులు మాట్లాడుతూ.. తన కొడుకు డిగ్రీ పూర్తి చేసి తండ్రికి అండగా ఉండాలనుకున్నాడు. తన కుటుంబానికి భారం కావొద్దనే ఉద్దేశంతో క్యాబ్ నడుపుతూనే ఎస్సై రాత పరీక్ష శిక్షణ పూర్తి చేశాడని, అంతా బాగుంటే, ఆదివారం జరిగిన ఎస్సై పరీక్షకు హాజరయ్యేవాడని, ఇంతలోనే పరీక్ష రాయాల్సిన తన కొడుకు, ఆసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్నాడని తల్లిదండ్రులు తల్లడిల్లారు. తన కొడుకు వెంకటేశ్ కు చికిత్స కోసం ఇప్పటికే రూ.10 లక్షల వరకు ఖర్చయిందని, ఆర్థికంగా భారమవడంతో సోమవారం మరో ఆసుపత్రికి మార్చామని కుటుంబసభ్యులు వాపోయారు. మరో బాధితుడు పర్వతాలు కోలుకుంటున్నట్లు తెలిపారు.
Also Read
- Revanth Reddy: హజ్ యాత్రికులకు అండగా ఉంటాం.. యాత్రను ప్రారంభించిన రేవంత్రెడ్డి
- CM Revanth Reddy : దేశానికే మోడల్గా కొడంగల్.. రూ. 110 కోట్లతో శ్రీవారి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ
- Tragedy : హైదరాబాద్లో కలకలం.. రిటైర్డ్ IPS భార్యను చంపిన నేపాలీ గ్యాంగ్..!
- Jupally Krishna Rao : తుమ్మిడిహెట్టి పునరుద్ధరణే ధ్యేయం.. బీఆర్ఎస్ వైఫల్యాలే రైతులకు శాపం
read also: Bihar Politics: బీజేపీతో జేడీయూ తెగదెంపులు.. గవర్నర్ అపాయింట్మెంట్ కోరిన సీఎం నితీష్ కుమార్
ఉప్పర్ పల్లి కి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రాఫిక్ ప్రభావమో లేక, ఏ ఇతర కారణమో ఓలా క్యాబ్ డ్రైవర్ ఆర గంట ఆలస్యంగా వచ్చాడు. దీంతో క్యాబ్ డ్రైవర్ ను వినయ్ రెడ్డి నిలదీసాడు. ఇద్దరి మద్య మాటా మాటా పెరగింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో.. వియన్ రెడ్డి అతని స్నేహితులు ఓలా డ్రైవర్ పై దాడి చేసారు. తీవ్రంగా కొట్టారు. దీంతో క్యాబ్ డ్రైవర్ దాడి విషయాన్ని క్యాబ్ యజమానికి ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న యజమాని హుటాహుటిన ఉప్పర్ పల్లి కి చేరుకుని వినయ్ రెడ్డి తో వాగ్వాదానికి దిగాడు. ఇలా దాడికి దిగడం సరైన పద్దతి కాదని తెలిపారు. దీంతో వియన్ రెడ్డి అతని స్నేహితులు ఓలా యజమానిని సైతం చితకబాదారు. ఉదయం 4 గంటల వరకు ఓ రూమ్ లో బంధించి దాడి చేసిన విషయం తెలిసిందే.
అయితే ఈ ఘటనలో నిందితులను తప్పించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. అధికారులు నిందితులను నిజంగానే తప్పించే ప్రయత్నం చేస్తున్నారా.. లేక బాధితులతో మంతనాలు చేసేందుకు యత్నం చేస్తున్నారా అనే ఆరోపణలు వస్తున్నా. అరగంట ఆలస్యం రావడంతో క్యాబ్ డ్రైవర్ పై దాడి చేయడం, విచక్షణా రహితంగా కొట్టడం మృగాల్ల ప్రవర్తించారని ప్రజలు అంటున్నారు. మరి ఇటాంటి ఘటనలు జరగకుండా నిందితులపై కఠిచర్యలు తీసుకోవాలని, బాధితుడి, కుటుంబ సభ్యులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Bottle Gourd Moong Dal Cheela Recipe: బ్రేక్ఫాస్ట్ కోసం కరకరలాడే సొరకాయ-పెసరపప్పు చిల్లా.. ఒకసారి చేస్తే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది!
-
Peddi: ‘పెద్ది’ సెట్స్లో మెగాస్టార్ సందడి..
-
Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
-
KL Rahul IPL Record: ఐపీఎల్లో కోహ్లీకే సాధ్యం కాని ఘనత.. చరిత్ర సృష్టించిన రాహుల్!
-
Finn Allen: ఇది ‘ఫిన్ అలెన్ 2.0’.. 40 బంతులు నా టార్గెట్.. కేకేఆర్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు!