TS Paddy Procurement: బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Department of Food and Public Distribution Given Clarification on the Suspension of Telangana Paddy Procurement.
బియ్యం సేకరణ నిలిపివేయడం పై కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. అన్న యోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ప్రకటనలో ఆరోపించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సెంట్రల్ పూల్లోకి సేకరించడాన్ని నిలిపివేసిందని, ఆ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వమే సృష్టించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ పేర్కొంది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లను అదుపు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోని వైనాన్ని గమనించిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. 40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచుల మాయమవడాన్ని గుర్తించామని, డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది.
Also Read
మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశాన్ని గుర్తించామని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీల్లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని, అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అన్న యోజన పథకం కింద ఏప్రిల్-మే నెలల కోటా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది. కానీ ఆ బియ్యాన్ని లబ్దిదారులకు అందకుండా చేసిందని, ఈ కారణంతో తప్పనిసరి పరిస్థితుల్లో సెంట్రల్ పూల్లోకి బియ్యం సేకరణను నిలిపివేసిందని కేంద్ర ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
-
Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
-
PoK Unrest 2026: పతనం అంచున పీఓకే.. పాలకులపై తిరగబడ్డ జనం! భారత్లో కలవడానికి పీఓకే మొగ్గు చూపుతోందా?
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!