Vande Bharath: తెలంగాణకు మరో రెండు వందే భారత్ రైళ్లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two more Vande Bharat trains to Telangana: తెలంగాణకు మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర రైల్వే శాఖ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. అందులో తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అవున్నాయి. దీనికి ప్రజాదరణ కూడా బాగానే పెరిగింది. అందుకోసం మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. సికింద్రాబాద్ నుంచి కూడా ఆ రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది.
Read also: Hyderabad Traffic Restrictions: వాహనదారులు అలర్ట్.. మొదలైన ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
సికింద్రాబాద్ నుంచి బెంగుళూరుకు ఒకటి, సికింద్రాబాద్ నుంచి పూణేకు మరొకటి నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వందేభారత్ రైలు కాచిగూడ-బెంగళూరు మార్గంలో ఉంటుందని సమాచారం. ఇప్పటికే రెండు నగరాల మధ్య అనేక రైళ్లు నడుస్తున్నాయి. అయితే, రైలు ప్రయాణ సమయం సుమారు 12 గంటలు పడుతుంది. దీనిపై స్పందించిన రైల్వే శాఖ కేవలం ఎనిమిది గంటల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఇది ఇలా ఉండగా కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈ రైళ్లను నిర్ణీత సమయం కంటే ముందుగానే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో సికింద్రాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా సికింద్రాబాద్ నుంచి పుణెకు మరో రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ – బుష్రాల వివాహం..ఇస్లాం విరుద్ధం
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!