Vande Bharath: తెలంగాణకు మరో రెండు వందే భారత్ రైళ్లు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Two more Vande Bharat trains to Telangana: తెలంగాణకు మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర రైల్వే శాఖ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 14 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. అందులో తెలుగు రాష్ట్రాల మధ్య రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఒకటి సికింద్రాబాద్-విశాఖపట్నం, మరొకటి సికింద్రాబాద్-తిరుపతి ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమయ్యాయి. రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అవున్నాయి. దీనికి ప్రజాదరణ కూడా బాగానే పెరిగింది. అందుకోసం మరో రెండు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. సికింద్రాబాద్ నుంచి కూడా ఆ రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను నడపాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది.
Read also: Hyderabad Traffic Restrictions: వాహనదారులు అలర్ట్.. మొదలైన ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
సికింద్రాబాద్ నుంచి బెంగుళూరుకు ఒకటి, సికింద్రాబాద్ నుంచి పూణేకు మరొకటి నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. వందేభారత్ రైలు కాచిగూడ-బెంగళూరు మార్గంలో ఉంటుందని సమాచారం. ఇప్పటికే రెండు నగరాల మధ్య అనేక రైళ్లు నడుస్తున్నాయి. అయితే, రైలు ప్రయాణ సమయం సుమారు 12 గంటలు పడుతుంది. దీనిపై స్పందించిన రైల్వే శాఖ కేవలం ఎనిమిది గంటల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడిపేందుకు సిద్ధమైంది. ఇది ఇలా ఉండగా కర్ణాటకలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ఈ రైళ్లను నిర్ణీత సమయం కంటే ముందుగానే ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో సికింద్రాబాద్-బెంగళూరు మధ్య వందే భారత్ రైలును ప్రారంభించనున్నట్లు సమాచారం. అంతే కాకుండా సికింద్రాబాద్ నుంచి పుణెకు మరో రైలు నడపాలని కేంద్ర రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ – బుష్రాల వివాహం..ఇస్లాం విరుద్ధం
తాజావార్తలు
-
Rahul Ramakrishna : థియేటర్లు ఖాళీగా ఉండటానికి అసలు కారణం ఇదే..
-
Sonia Gandhi: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ.. పర్యటన రద్దు చేసుకుని, హుటాహుటిన ఢిల్లీకి రాహుల్ పయనం!
-
Bhuvneshwar Kumar: నేను బౌలర్ను కాదు.. భువనేశ్వర్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Vijay Government Trust Vote: బలపరీక్షలో నెగ్గిన విజయ్ సర్కార్..!
-
Milk Storage Tips: వేసవిలో పాలు విరిగిపోతున్నాయా..? ఈ చిన్న చిట్కాలతో తాజాగా నిల్వ చేసుకోండి
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!