NTV Telugu Site icon

Medaram: మేడారానికి వెళుతున్న కుటుంబంలో విషాదం.. నీటి సంపులో తేలిన పిల్లలు

Warangal Crime

Warangal Crime

Medaram: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరను తిలకించేందుకు వరంగల్ వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటూ అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఇద్దరు చిన్నారులు నీటిలో పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Read also: Chiranjeevi-Surekha: సతీమణి బర్త్‌డే.. మెగాస్టార్ ‘చిరు’ కవిత! ఫాన్స్ ఫిదా

వరంగల్ నగరంలోని బాలాజీ నగర్‌కు చెందిన మరికాల రాముడు శ్రీనివాస్ కుమార్తె బాలేశ్వరిని వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన రవికుమార్‌తో కొంతకాలం క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి శౌరితేజ (4), తేజస్విని (2) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. జాతరలో రద్దీని దృష్టిలో ఉంచుకుని రామశ్రీనివాస్ దంపతులు ముందస్తు బిడ్లు వేయాలని నిర్ణయించుకున్నారు. శనివారం మధ్యాహ్నం మేడారం వెళ్లాలని నిర్ణయించుకున్న రామశ్రీనివాస్ దంపతులు కూతురు, అల్లుడిని కూడా ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఉంటున్న బాలేశ్వరి రవికుమార్‌ తమ ఇద్దరు పిల్లలు శౌరితేజ, తేజస్వినిలను శుక్రవారం సాయంత్రం 8 గంటల ప్రాంతంలో వరంగల్‌ నగరానికి తీసుకొచ్చారు.

Read also: Chiranjeevi-Surekha: సతీమణి బర్త్‌డే.. మెగాస్టార్ ‘చిరు’ కవిత! ఫాన్స్ ఫిదా

నీటిలో తేలియాడుతున్న పిల్లలు

బాలేశ్వరి, రవికుమార్‌లు హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ రాగానే ప్రయాణంలో అలసిపోవడంతో పొద్దున్నే నిద్రపోయారు. మిగతా కుటుంబ సభ్యులందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో అమ్మమ్మ ఇంటికి వచ్చిన చిన్నారులు శౌరితేజ, తేజస్విని ఆనందంగా ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. దాన్ని ఎవరూ గమనించలేకపోయారు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులు చిన్నారులు కనిపించకపోవడంతో వెతికారు. ఇంతలో తల్లి బాలేశ్వరి, తండ్రి రవికుమార్ నిద్ర లేవడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురై పిల్లల కోసం వెతికారు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకపోయింది.

ఈ క్రమంలో ఇంటి ఆవరణలోని వాటర్ ట్యాంక్ వైపు వెళ్లి చూడగా చిన్నారి తేజస్విని మృతదేహం నీటిలో తేలియాడుతూ కనిపించింది. నీటిలో మునిగిపోయిన శౌరితేజను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీశారు. బాలుడు కూడా అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. బాధిత కుటుంబీకులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చిన ఆ కుటుంబంలోని ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో వరంగల్ బాలాజీ నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
CM Revanth Reddy: తెలంగాణ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం.. ప్రారంభించిన సీఎం