IIT Student: మమైతా ఆత్మహత్య కేసు.. కీలకంగా మారిన సెల్ ఫోన్, సూసైడ్ నోటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Student: హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఐఐటీ విద్యార్థిని మమత ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె ఆత్మహత్యపై పోలీసులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మమైత ఫోన్, సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్టు తర్వాత చాలా విషయాలు నిర్ధారణ అవుతాయి. మరోవైపు క్యాంపస్లో ర్యాగింగ్ వల్లే మమైత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మమత సెల్ ఫోన్, సూసైడ్ నోట్ కీలకంగా మారాయి. ఆమె గదిలో రెండు సూసైడ్ నోట్లు లభించడం గమనార్హం. ఆమె వాటిని వ్రాసిందా? ఎవరైనా రాశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది. గత నెల, క్యాంపస్ వదిలి విశాఖ బీచ్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కార్తీక్, సోమవారం మరో విద్యార్థి మరణించారు. హైదరాబాద్లోని ఐఐటీ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న మమైతానాయక్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపుల్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని అక్కడి మార్చురీలో ఉంచారు.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
Read also: Moto G14: మోటోరోలా స్మార్ట్ఫోన్ రిలీజ్.. ధర రూ.9,999 మాత్రమే..!
మమైతానాయక్ ఒడిశాకు చెందిన విద్యార్థి. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఒడిశా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ముందుగా కాలేజీకి వెళ్లి.. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లారు. గత ఆగస్టు నుంచి ఈ క్యాంపస్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 31న ఒకరు, సెప్టెంబర్ 7న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.ఇక గత నెల 15వ తేదీన కార్తీక్ అనే విద్యార్థి ఇంటికి వెళ్తున్నానని చెప్పి క్యాంపస్ నుంచి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత విశాఖ బీచ్లో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తాజాగా మమైతా నాయక్ ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పది రోజుల క్రితం మమతా నాయక్ ఒడిశా వెళ్లారు. చదువుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే చున్నీ తెగిపోవడంతో తీగకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపస్ నుంచి హాస్టల్కు వెళ్లింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆమె భోజనం చేసేందుకు కూడా రాకపోవడంతో తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లగా, గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎంత తట్టినా తలుపు తీయకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వచ్చి బలవంతంగా తలుపు తీయగా, మమైతా నాయక్ శవమై కనిపించింది.
దాంపత్య సమస్యలను దూరం చేసే జాజికాయ
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!