IIT Student: మమైతా ఆత్మహత్య కేసు.. కీలకంగా మారిన సెల్ ఫోన్, సూసైడ్ నోటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Student: హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఐఐటీ విద్యార్థిని మమత ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె ఆత్మహత్యపై పోలీసులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మమైత ఫోన్, సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్టు తర్వాత చాలా విషయాలు నిర్ధారణ అవుతాయి. మరోవైపు క్యాంపస్లో ర్యాగింగ్ వల్లే మమైత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మమత సెల్ ఫోన్, సూసైడ్ నోట్ కీలకంగా మారాయి. ఆమె గదిలో రెండు సూసైడ్ నోట్లు లభించడం గమనార్హం. ఆమె వాటిని వ్రాసిందా? ఎవరైనా రాశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది. గత నెల, క్యాంపస్ వదిలి విశాఖ బీచ్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కార్తీక్, సోమవారం మరో విద్యార్థి మరణించారు. హైదరాబాద్లోని ఐఐటీ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న మమైతానాయక్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపుల్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని అక్కడి మార్చురీలో ఉంచారు.
Also Read
Read also: Moto G14: మోటోరోలా స్మార్ట్ఫోన్ రిలీజ్.. ధర రూ.9,999 మాత్రమే..!
మమైతానాయక్ ఒడిశాకు చెందిన విద్యార్థి. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఒడిశా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ముందుగా కాలేజీకి వెళ్లి.. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లారు. గత ఆగస్టు నుంచి ఈ క్యాంపస్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 31న ఒకరు, సెప్టెంబర్ 7న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.ఇక గత నెల 15వ తేదీన కార్తీక్ అనే విద్యార్థి ఇంటికి వెళ్తున్నానని చెప్పి క్యాంపస్ నుంచి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత విశాఖ బీచ్లో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తాజాగా మమైతా నాయక్ ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పది రోజుల క్రితం మమతా నాయక్ ఒడిశా వెళ్లారు. చదువుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే చున్నీ తెగిపోవడంతో తీగకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపస్ నుంచి హాస్టల్కు వెళ్లింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆమె భోజనం చేసేందుకు కూడా రాకపోవడంతో తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లగా, గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎంత తట్టినా తలుపు తీయకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వచ్చి బలవంతంగా తలుపు తీయగా, మమైతా నాయక్ శవమై కనిపించింది.
దాంపత్య సమస్యలను దూరం చేసే జాజికాయ
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!