IIT Student: మమైతా ఆత్మహత్య కేసు.. కీలకంగా మారిన సెల్ ఫోన్, సూసైడ్ నోటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Student: హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఐఐటీ విద్యార్థిని మమత ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె ఆత్మహత్యపై పోలీసులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మమైత ఫోన్, సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్టు తర్వాత చాలా విషయాలు నిర్ధారణ అవుతాయి. మరోవైపు క్యాంపస్లో ర్యాగింగ్ వల్లే మమైత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మమత సెల్ ఫోన్, సూసైడ్ నోట్ కీలకంగా మారాయి. ఆమె గదిలో రెండు సూసైడ్ నోట్లు లభించడం గమనార్హం. ఆమె వాటిని వ్రాసిందా? ఎవరైనా రాశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది. గత నెల, క్యాంపస్ వదిలి విశాఖ బీచ్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కార్తీక్, సోమవారం మరో విద్యార్థి మరణించారు. హైదరాబాద్లోని ఐఐటీ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న మమైతానాయక్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపుల్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని అక్కడి మార్చురీలో ఉంచారు.
Also Read
Read also: Moto G14: మోటోరోలా స్మార్ట్ఫోన్ రిలీజ్.. ధర రూ.9,999 మాత్రమే..!
మమైతానాయక్ ఒడిశాకు చెందిన విద్యార్థి. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఒడిశా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ముందుగా కాలేజీకి వెళ్లి.. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లారు. గత ఆగస్టు నుంచి ఈ క్యాంపస్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 31న ఒకరు, సెప్టెంబర్ 7న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.ఇక గత నెల 15వ తేదీన కార్తీక్ అనే విద్యార్థి ఇంటికి వెళ్తున్నానని చెప్పి క్యాంపస్ నుంచి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత విశాఖ బీచ్లో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తాజాగా మమైతా నాయక్ ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పది రోజుల క్రితం మమతా నాయక్ ఒడిశా వెళ్లారు. చదువుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే చున్నీ తెగిపోవడంతో తీగకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపస్ నుంచి హాస్టల్కు వెళ్లింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆమె భోజనం చేసేందుకు కూడా రాకపోవడంతో తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లగా, గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎంత తట్టినా తలుపు తీయకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వచ్చి బలవంతంగా తలుపు తీయగా, మమైతా నాయక్ శవమై కనిపించింది.
దాంపత్య సమస్యలను దూరం చేసే జాజికాయ
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!