IIT Student: మమైతా ఆత్మహత్య కేసు.. కీలకంగా మారిన సెల్ ఫోన్, సూసైడ్ నోటు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Student: హైదరాబాద్ లోని కంది ఐఐటీ క్యాంపస్ లో మమైతానాయక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఐఐటీ విద్యార్థిని మమత ఆత్మహత్య కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పుడు ఆమె ఆత్మహత్యపై పోలీసులు, కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మమైత ఫోన్, సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్టు తర్వాత చాలా విషయాలు నిర్ధారణ అవుతాయి. మరోవైపు క్యాంపస్లో ర్యాగింగ్ వల్లే మమైత చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మమత సెల్ ఫోన్, సూసైడ్ నోట్ కీలకంగా మారాయి. ఆమె గదిలో రెండు సూసైడ్ నోట్లు లభించడం గమనార్హం. ఆమె వాటిని వ్రాసిందా? ఎవరైనా రాశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఐఐటీ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది. గత నెల, క్యాంపస్ వదిలి విశాఖ బీచ్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కార్తీక్, సోమవారం మరో విద్యార్థి మరణించారు. హైదరాబాద్లోని ఐఐటీ క్యాంపస్లో ఎంటెక్ చదువుతున్న మమైతానాయక్ అనే విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. క్యాంపుల్ హాస్టల్లోని తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని అక్కడి మార్చురీలో ఉంచారు.
Also Read
- Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
- Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్లో కొత్త టూరిజం హబ్
- Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
Read also: Moto G14: మోటోరోలా స్మార్ట్ఫోన్ రిలీజ్.. ధర రూ.9,999 మాత్రమే..!
మమైతానాయక్ ఒడిశాకు చెందిన విద్యార్థి. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఒడిశా నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు. ముందుగా కాలేజీకి వెళ్లి.. అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లారు. గత ఆగస్టు నుంచి ఈ క్యాంపస్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆగస్టు 31న ఒకరు, సెప్టెంబర్ 7న ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు.ఇక గత నెల 15వ తేదీన కార్తీక్ అనే విద్యార్థి ఇంటికి వెళ్తున్నానని చెప్పి క్యాంపస్ నుంచి వెళ్లిపోయాడు. నాలుగు రోజుల తర్వాత విశాఖ బీచ్లో శవమై కనిపించాడు. ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. తాజాగా మమైతా నాయక్ ఆత్మహత్యల పరంపర కలకలం రేపుతోంది.
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పది రోజుల క్రితం మమతా నాయక్ ఒడిశా వెళ్లారు. చదువుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. తొలుత ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే చున్నీ తెగిపోవడంతో తీగకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం 5 గంటలకు క్యాంపస్ నుంచి హాస్టల్కు వెళ్లింది. అనంతరం రాత్రి 8 గంటల సమయంలో ఆమె భోజనం చేసేందుకు కూడా రాకపోవడంతో తోటి విద్యార్థులు గదిలోకి వెళ్లగా, గది లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎంత తట్టినా తలుపు తీయకపోవడంతో యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వచ్చి బలవంతంగా తలుపు తీయగా, మమైతా నాయక్ శవమై కనిపించింది.
దాంపత్య సమస్యలను దూరం చేసే జాజికాయ
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!