TSRTC New Plan: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. మెట్రో రైలు తరహాలో బస్సుల్లో సీటింగ్ మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC New Plan: మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 18 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగింది. ఒకప్పుడు ఆర్టీసీ బస్సుల్లో 11 లక్షల మంది మాత్రమే ప్రయాణించేవారు. ఇక నగరంలో పరిస్థితి దారుణంగా మారింది. ఉదయం పూట ఉద్యోగాలకు, కళాశాలలకు వెళ్లే వారితో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సోమ, బుధవారాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. బస్సుల్లో కూర్చునే సమస్య ఉంది. దీంతో బస్సుల్లో ఎక్కువ సీట్లు ఉంటేనే ఎక్కువ మంది ప్రయాణించవచ్చని భావించిన tsrtc కొత్త నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని బస్సుల్లో కొన్ని సీట్లు తొలగించి, మెట్రో రైలులో మాదిరిగానే ఇరువైపులా సీటింగ్ ఏర్పాటు చేస్తే మధ్యలో ఎక్కువ స్థలం ఉండడంతో ఎక్కువ మందికి సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తోంది.
Read also: CPI Ramakrishna: ఎన్నికల కోసమే ఉమ్మడి రాజధాని డ్రామా..!
Also Read
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
- Hyderabad Cyber Crime: దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ పోలీసుల ఆపరేషన్.. సిమ్లు సరఫరా చేస్తున్న ముఠాల గుట్టురట్టు
- CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ఈ మేరకు కొన్ని బస్సుల్లో సీట్లు మార్చి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు. ఈ విధానం విజయవంతమైతే హైదరాబాద్లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. సిటీ బస్సుల్లో 44 సీట్లు ఉంటే 63 మంది ప్రయాణిస్తే 100% ఆక్యుపెన్సీని ఆర్టీసీ పరిగణిస్తుంది. మహాలక్ష్మి పథకం పుణ్యమా అని మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో బస్సు ఎక్కేందుకు, దిగేందుకు, కండక్టర్ టిక్కెట్లు ఇవ్వడానికి ఇబ్బందిగా మారింది. టిక్కెట్ల ప్రక్రియలో ఎవరికీ జీరో టికెట్ ఇవ్వకున్నా కండక్టర్ పైనా చర్యలు తీసుకుంటున్నందున ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా సీటింగ్ సిస్టమ్ మార్చడమే మంచిదని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. మరి ఆర్టీసీ మెట్రో తరహా బస్సుల ఈ కొత్త విధానం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
Business Payments via Cards : వీసా, మాస్టర్కార్డ్లపై ఇక ఆ చెల్లింపులు నిషేధం
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..