TSRTC New Rule: కిటికీ పక్క సీటు స్పెషల్ కాస్ట్ గురూ.. ఈనెల 27 నుంచే అమలు
TSRTC New Rule: టీఎస్ఆర్టీసీ ఆన్లైన్ టికెట్ బుకింగ్లో డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దేశంలో తొలిసారిగా విమానాలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, హోటళ్లలో అమలు చేస్తున్న ఈ పద్దతిని ప్రభుత్వ రంగంలో అది కూడా బస్సుల్లో అమల్లోకి తీసుకురాబోతుంది. ఈనెల 27వ తేదీ నుంచి హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. ప్రయాణికుల రద్దీ ఉండే వారాంతాలు, పండుగ రోజుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానంలో సాధారణ ఛార్జీలకు మించి టికెట్ ధర ఉంటుంది. అంతేకాకుండా.. సాధారణ రోజుల్లో తక్కువగా ఉంటుంది. అయితే.. డిమాండ్ ని బట్టి 125 శాతం నుంచి 70 శాతం వరకు ధరలు మారుతుంటాయి. ఇదే కాదండోయ్ ముందు సీట్లు, కిటికీ పక్కన సీట్లకు ఎక్కువ ధర ఉంటుంది. అంటే.. ఈ పద్ధతిలో కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలు ప్రైవేటు ఆపరేటర్ల రేట్లు, ఇతర రాష్ట్రాల ఆర్టీసీల ఛార్జీలను విశ్లేషించి టికెట్ ధరలు నిర్ణయిస్తామని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ వెల్లడించారు. ఇక.. ఆన్ లైన్ టికెట్ బుకింగ్ లో డైనమిక్ ప్రైసింగ్ ద్వారా ప్రైవేట్ ఆపరేటర్ల పోటీ తట్టుకొని ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు ఆర్టీసీ కసరత్తులు చేస్తోంది.
Read also: Rohit Sharma : వరల్డ్ కప్ ఉంటే బామ్మర్ది పెళ్లికి కూడా వెళ్లొద్దా..?
Also Read
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Legislative Council: ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్, ప్రో. కోదండరాం
- Petrol, Diesel: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత భయాల వేళ.. సివిల్ సప్లై కమిషనర్ కీలక ప్రకటన
- Traffic Constable: రైతు ఇబ్బంది తీర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. స్థానికుల నుంచి ప్రశంసల వర్షం
అయితే.. ఈ విధానం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ముందుస్తు రిజర్వేషన్ సదుపాయం 60 రోజులకు పెంచింది. ప్రయాణించే వారి అవసరాలకు అనుగుణంగా ప్రారంభించిన కార్గో, డిజిటల్ సేవలు, కొత్త ఎలక్ట్రిక్ బస్సులకు ఇప్పటికే ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అన్నారు. అయితే.. కార్గో సేవలపై కొన్ని విమర్శలు వస్తున్న క్రమంలో యాజమాన్యం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇక, వరంగల్ కళాశాలలో హుందాగా ప్రవర్తించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తోందన్నారు. దీంతో.. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకే డైనమిక్ ప్రైసింగ్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక.. డైనమిక్ ప్రైసింగ్ విధానంలో వికలాంగులు, విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులకు ఛార్జీల్లో మార్పులు ఉండబోవని ఆర్టీసీ స్పష్టత ఇచ్చింది. అయితే.. ప్రయాణికుల సౌకర్యార్థం భవిష్యత్తులో మరిన్ని నూతన పద్ధతులు తీసుకురాబోతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది.
దేశంలోనే ప్రజా రవాణా వ్యవస్థలో మొదటిసారిగా 'డైనమిక్ ప్రైసింగ్' విధానాన్ని ఈ నెల 27 నుంచి #TSRTC అమలు చేయనుంది. సంస్థ ఏ కొత్త కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారు. డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని కూడా అలానే ప్రోత్సహిస్తారని సంస్థ ఆశిస్తోంది. @TSRTCHQ pic.twitter.com/85HP1ljBJT
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 24, 2023
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!