TSRTC New Record: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికి అయినా ఫ్రీగా ప్రయాణించవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా మహిళలు బస్సుల్లో ప్రయాణించడం పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీంతో బస్సుల రాకపోకలు పెరిగిపోయి నిలబడే పరిస్థితులు లేవు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (డిసెంబర్ 19) రికార్డు స్థాయిలో 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించారు. పాస్ హోల్డర్లు మినహా 48.5 లక్షల మందికి ఆర్టీసీ టిక్కెట్లు జారీ చేసింది.
Read also: Congress: జనవరి 2024లో భారత్ జోడో యాత్ర 2.0ని ప్రారంభించే ఛాన్స్..
వీరిలో 30.16 లక్షల మంది మహిళలు ఉండటం విశేషం. మహాలక్ష్మి పథకం ప్రారంభానికి ముందు, మొత్తం ప్రయాణీకులలో కేవలం 40 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ సంఖ్య 60 శాతానికి చేరుకుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న రీయింబర్స్మెంట్తో కలిపి ఒక్కరోజులోనే రూ.21.10 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ఆర్టీసీ జోన్ల పరిధిలో సోమవారం బస్సులు 33.36 లక్షల కి.మీ. కరీంనగర్ జోన్లో గరిష్టంగా 14.49 లక్షల కిలోమీటర్లు, హైదరాబాద్ జోన్లో 10.93 లక్షల కిలోమీటర్లు, గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 7.94 లక్షల కిలోమీటర్ల మేర తిరిగినట్లు వెల్లడించారు.
CM Revanth Reddy: హైదరాబాద్కు సీఎం రేవంత్రెడ్డి.. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా అసెంబ్లీకి