TSRTC Bus Tickets: టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. టీ-24 టికెట్లలో భారీ డిస్కౌంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC Bus Tickets: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సీనియర్ సిటిజన్లతో పాటు హైదరాబాద్ నగరంలోని సాధారణ ప్రయాణికులకు టిక్కెట్లపై భారీ తగ్గింపును ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించే వృద్ధులకు టికెట్పై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక.. హైదరాబాద్ నగరంలో 24 గంటలపాటు అపరిమిత ప్రయాణానికి టీ-24 టికెట్ రూ.లకే ఇవ్వాలని నిర్ణయించారు. 75.. అదే T-24 టిక్కెట్టు పిల్లలకు కేవలం రూ. 50. అయితే, ఈ తగ్గింపులు ఆగస్టు పదిహేనవ తేదీన మాత్రమే చెల్లుబాటు అవుతాయని TSRTC యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం టి-24 టిక్కెట్టు సాధారణ ప్రయాణికులకు రూ.120, మహిళలు మరియు సీనియర్ సిటిజన్లకు రూ.100, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.80గా ఉంది. అయితే.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అందిస్తున్న రాయితీలకు సంబంధించి పూర్తి వివరాల కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లో సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
Read also: Traffic Diversions: పంద్రాగస్టు రోజున ట్రాఫిక్ ఆంక్షలు.. గోల్కొండకు వెళ్లే వారికి సూచనలు..
Also Read
- Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
- HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
- OTR: తెలంగాణలో అప్పుడే ఎన్నికల తరహా వాతావరణం.. సీఎం గేర్ మార్చబోతున్నారా..?
పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లపై 50 శాతం రాయితీ ఇవ్వాలని, 60 ఏళ్లు పైబడిన మహిళ, పురుష సీనియర్ సిటిజన్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ప్రయాణిస్తున్నప్పుడు వయస్సు నిర్ధారణ కోసం వారు తమ ఆధార్ కార్డును బస్సు కండక్టర్కు చూపించాలి. .అలాగే స్వాతంత్ర్య దినోత్సవం రోజున హైదరాబాద్ నగరంలో చాలా మంది ప్రయాణిస్తున్నారు.పెద్ద ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు.ఆ రోజు పర్యాటక ప్రాంతాలు, పార్కులు బాగా రద్దీగా ఉంటాయి.ఈ నేపథ్యంలోనే సంస్థ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. T-24 టికెట్.. పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.50 టిక్కెట్టు ఇస్తున్నారు.ఈ డిస్కౌంట్లు ఈ నెల 15వ తేదీన ఒక్కరోజు మాత్రమే అందుబాటులో ఉంటాయి.ప్రజలు ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో పుష్పక్ బస్సుల్లో ప్రయాణించే వారికి నగరంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ అందుబాటులోకి తెచ్చింది. పుష్పక్ బస్సులో టికెట్ కొనుగోలు చేసినప్పటి నుంచి 3 గంటల పాటు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
Shiva Stotram: ఈ స్తోత్ర పారాయణం చేస్తే వాహన ప్రమాదాలు ఉండవు
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!