TS TET : సెప్టెంబర్ లో టెట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. .అయితే డీఎస్పీపై ఇప్పటి వరకు మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే లేదు. గతేడాది విద్యాశాఖ టెట్ పరీక్షను నిర్వహించింది.ఆ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇస్తుందని నిరుద్యోగులు అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు ప్రకటన మాత్రం జారీ కాలేదు. ఇప్పటికే టెట్ పరీక్ష నిర్వహించి ఏడాది పూర్తి అయిపోయింది.. ఈ నేపథ్యంలో తాాజాగా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహించేందుకు రెడీ అవుతుంది.. ఇందుకు తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం కూడా ఆమోదముద్ర వేసింది. పరీక్ష నిర్వహణకు సంబంధించి కూడా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది.
టెట్ పరీక్ష నిర్వహణకు సుమారు వంద రోజులకు పైగా సమయం పడుతుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ మరియు ఇతర ప్రక్రియలు కలిపి పరీక్ష రోజుకు మొత్తం 80 రోజులు సమయం పడుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఫలితాల వెల్లడికి దాదాపు 20 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నట్లు సమాచారం. మొత్తంగా కలిపి వంద రోజుల సమయం పడుతుందని వారు అంచనా వేశారు. గతేడాది మార్చి 24న టెట్ నోటిఫికేషన్ జారీ చేయగా పరీక్షను జూన్ 27న నిర్వహించిన విషయం తెలిసిందే. తాజా అంచనాల ప్రకారం చూస్తే.. సెప్టెంబర్ మాసంలో టెట్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారంకొత్తగాడీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులైన వారు 20వేలకు పైగా నే ఉన్నారు. గత కొంతకాలంగా మరో టెట్ నిర్వహించిన తర్వాతే డీఎస్సీ పరీక్షను జరపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈసారి నిర్వహించబోయే పరీక్షకు కూడా దాదాపు 3 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
- Tags
- #nirudyogulu
- DSC
- TET
- TS Govt
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!