తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్ కళాశాలల నిర్వహణ , అఫిలియేషన్ ప్రక్రియలో ఇంటర్మీడియట్ విద్యా మండలి కీలక మార్పులను ప్రవేశపెట్టింది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ కళాశాలల అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 12, 2026 నుండి ఆన్లైన్ వేదికగా ప్రారంభం కానుంది. విద్యా సంస్థలు ఎలాంటి అదనపు రుసుము చెల్లించకుండా దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 13, 2026 వరకు గడువు ఇచ్చారు. ఒకవేళ నిర్ణీత సమయంలోగా దరఖాస్తు చేయని పక్షంలో, గరిష్టంగా ₹20,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 17, 2026 వరకు అవకాశం కల్పించారు. ఈసారి దరఖాస్తులు , ఫీజు చెల్లింపుల ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసిన బోర్డు, ఆఫ్లైన్ ద్వారా వచ్చే డిమాండ్ డ్రాఫ్ట్ (DD)లు లేదా చలాన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కళాశాలల నాణ్యత , భద్రత విషయంలో బోర్డు ఈసారి అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. దరఖాస్తు చేసే సమయంలో కళాశాల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ రశీదు (FDR), భవనానికి సంబంధించిన రిజిస్టర్డ్ లీజు పత్రం, , అత్యంత కీలకమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్తో పాటు శానిటరీ, బిల్డింగ్ సౌండ్నెస్ సర్టిఫికేట్లు చట్టబద్ధంగా అమలులో ఉండాలని సూచించింది. వీటితో పాటు బోధనా సిబ్బంది వివరాలు , వారి విద్యార్హత పత్రాలను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం తప్పనిసరి చేశారు. ముఖ్యంగా, అదనపు వసతులు కల్పించకుండా కేవలం కోరుకునే అదనపు సెక్షన్ల ప్రతిపాదనలను బోర్డు నేరుగా తిరస్కరిస్తుంది. ముందస్తు అనుమతి లేకుండా కొత్త సెక్షన్లు ప్రారంభించడం నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది.
కళాశాలల్లో చేయాలనుకునే మార్పుల విషయంలో కూడా మండలి స్పష్టమైన గడువును విధించింది. కళాశాల పేరు మార్చడం, ఒకే మండలం పరిధిలో స్థలం మార్చడం లేదా కో-ఎడ్యుకేషన్కు సంబంధించిన మార్పులు చేయాలనుకునే వారు తమ అఫిలియేషన్ ప్రతిపాదనలతో పాటే ఏప్రిల్ 17లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కళాశాలైనా నిబంధనలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు విధించడంతో పాటు, ఆ కళాశాల గుర్తింపును శాశ్వతంగా రద్దు చేసే అధికారం విద్యా మండలికి ఉంటుంది. ఈ నిబంధనలన్నీ విద్యార్థుల భద్రతను , విద్యా ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా రూపొందించబడ్డాయి.
Breakfast Hack : పెనం లేకుండానే అదిరిపోయే ఆమ్లెట్.. ఎయిర్ ఫ్రైయర్ మ్యాజిక్ చూడండి.!
