Sabitha Indra Reddy: మంత్రి సబితా కీలక ప్రకటన.. త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పాఠశాల విద్యకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. 6,500 పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఆమె తెలిపారు. పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల కోసం పాఠశాలల్లో 1523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈసారి పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. దీనికి సంబంధించి రెండు రోజుల్లో నోటిఫికేషన్, విధివిధానాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
Read also: Harish Rao: నర్సాపూర్ టికెట్ లొల్లి.. స్పందించిన మంత్రి
Also Read
- CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
విద్యా రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. విద్యా రంగానికి ఈ ఏడాది రూ.29,613 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. గురుకులాలు మనందరికీ గర్వకారణంగా నిలిచేలా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కళాశాల స్థాయికి అప్గ్రేడ్ చేశామన్నారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే 5,310 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామన్నారు. ఇప్పటికే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశామన్నారు. అన్ని స్థాయిల విద్యా సంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ స్థాయిలో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది.
Ganja Selling: వీళ్లు అత్తాకోడళ్ళా.. యవ్వారం మమూలుగా లేదుగా..!
TSPSC, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు మరియు ఇతర బోర్డులు వేలాది ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు, పరీక్షలతో దూసుకుపోతున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 20 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నేడు టీఆర్టీ నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థులు ఆనందంలో మునిగితేలుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
King of Kotha Review: కింగ్ ఆఫ్ కొత్త రివ్యూ
తాజావార్తలు
-
Venkatesh Iyer: ఓ పద్దతి, విధానం.. విరాట్ కోహ్లీ విజయ రహస్యం చెప్పేసిన వెంకటేశ్!
-
Bab el-Mandeb Strait: ప్రపంచానికి ఇంధన షాక్?.. హార్మూజ్ తర్వాత మరో కీలక జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక
-
CM Revanth: తెలంగాణ రైజింగ్-2047తో ప్రపంచానికి గేట్వేగా తెలంగాణ.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం విజన్..!
-
Lalit Modi: ‘ఆమె డబ్బు కోసం ఆశపడేది కాదు’, సుష్మితా సేన్తో తన బ్రేకప్పై మౌనం వీడిన లలిత్ మోడీ..
-
Team India Schedule: ఐపీఎల్ 2026 ఓవర్.. వాట్ నెక్స్ట్.? 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే.!
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!