Munugodu By Election: మునుగోడులో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. అభ్యర్థి ఆయనే..?
Munugodu By Election: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నిక ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభకు భారీ ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. లక్ష మందితో సభ నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తుంది. ఈనెల 20న మునుగోడులో టీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాటుకు సభాస్థలిని నల్గొండ నేతలు ఇవాళ పరిశీలించనున్నారు. మునుగోడు ప్రజాదీవెన పేరుతో లక్ష మందితో సభ నిర్వహణ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఖాయమని తెలుస్తోంది? భారీ బహిరంగ సభలో మునుగోడులో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థిని కేసీఆర్ స్వయంగా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మునుగోడులో ఈనెల 20న మధ్యాహ్నం 2 గంటలకు సభ నిర్వహించేందుకు నేతలు ఏర్పాట్లు చేయనున్నారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు మండలాల వారిగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బాధ్యత అప్పగించారు సీఎం కేసీఆర్.
read also: USA: ఎఫ్ బీ ఐ ఆఫీస్ పై దాడికి యత్నం.. దుండగుడిని కాల్చిచంపిన పోలీసులు
Also Read
ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన కేసీఆర్, మునుగోడు ఉప ఎన్నిక సీరియస్ గా తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. ఉప ఎన్నిక తనపై బీజేపీ చేస్తున్న కుట్ర అని నేతలకు తెలిపారు. జాతీయ రాజకీయాల్లో తాను యాక్టివ్ అవుతుంటే అడ్డుకునే క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని వదిలేది లేదన్నారు కేసీఆర్. బీజేపీ కంటే ముందుకు కానే కేసీఆర్ 20న భారీ బహిరంగ సభకు పూర్తీ ఏర్పాట్లు చేయాలని , లక్షమందితో మునుగోడు సభ వుండానలి పేర్కొన్నారు.
బీజేపీ-టీఆర్ఎస్ సభః
అయితే.. ఈ నెల 21న చౌటుప్పల్లో ఏర్పాటు చేయబోయే భారీ బహిరంగ సభ ద్వారా బీజేపీ ముఖ్యనేత అమిత్ షా సమక్షంలోనే బీజేపీలో చేరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు అనేక మంది నేతలు ఆరోజు అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుంటారని బీజేపీ నేతలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో.. మునుగోడు ఉప ఎన్నిక కోసం అమిత్ షా రంగంలోకి దిగడానికి ముందుగానే, సీఎం కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారనే చర్చతో రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్ మునుగోడు ఉప ఎన్నికను ఎంతో సీరియస్గా తీసుకుంది. అక్కడ బీజేపీకి ధీటుగా ఎన్నికల ప్రచారం చేపట్టాలని చర్యలు చేపట్టింది. దీంతో అమిత్ షా సభ కంటే ముందుగానే మునుగోడు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు టీఆర్ఎస్ ఏర్పట్లు షురూ చేసింది. మునుగోడు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. అయితే.. ఇప్పటికే మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టన విసయం తెలిసిందే.
USA: ఎఫ్ బీ ఐ ఆఫీస్ పై దాడికి యత్నం.. దుండగుడిని కాల్చిచంపిన పోలీసులు
తాజావార్తలు
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
-
Moringa Chutney Recipe: క్షణాల్లో కారం కారంగా మునగ చట్నీ తయారు చేయండి.. రుచితో పాటు పుష్కలమైన విటమిన్లు మీ సొంతం!
-
Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
-
Rava Paratha Recipe: రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ బోర్ కొట్టిందా..? 10 నిమిషాల్లో మెత్తటి రవ్వ పరాఠాలు ఇలా తయారు చేయండి
-
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!