MLC Kavitha: ఇవాళ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనుంది. ఎమ్మెల్సీ కవిత సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.. అయితే కవిత వేసిన బెయిల్ పిటిషన్పై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరిగాయి. ఈ తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ (మే 2కు) రిజర్వ్ చేసింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకోగా, సీబీఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె రెండు బెయిల్ పిటషన్లు వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై ఆమె తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
Read also: Nitin Gadkari: నేడు ఏపీకి నితిన్ గడ్కరీ..
మహిళగా కవిత బెయిల్కు అర్హురాలని, అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదన్నారు. ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్నా.. సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసింది. అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదు. పార్టీకి స్టార్ క్యాంపైనర్. ప్రతిపక్షంలో ఉన్నాం.. రూలింగ్ లో ఉన్నపుడే, ఏం చెయ్యలేక పోయామన్నారు. చిదంబరం జడ్జిమెంట్ కవిత విషయంలో సరిపోతుందని తెలిపారు. ఏడేళ్ల లోపల పడే శిక్ష ఆధారాలకు అరెస్ట్ అవసరం లేదన్నారు. అరెస్ట్కు సరైన కారణాలు లేవని కవిత తరపున వాదనలు వినిపించారు. అనంతరం సీబీఐ తరపున వాదనలు జరిగాయి. “కవితకు బెయిల్ ఇవ్వొద్దని, కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని సీబీఐ వాదనలు వినిపించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాల్టికి (మే 2కు) రిజర్వ్ చేసింది. అయితే నేడు కవితకు బెయిల్ రానుందా? ట్రయల్ కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
China Flood: భారీ వర్షాలతో ఇబ్బందుల్లో చైనా.. హైవే కూలి 36 మంది మృతి