Panthangi Toll Plaza: ఏపీకి క్యూ కట్టిన వాహనాలు.. రద్దీగా మారిన పంతంగి టోల్ ప్లాజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panthangi Toll Plaza: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి NH 65 సంక్రాంతి పండుగ కారణంగా రద్దీగా మారింది. నేటి నుంచి 17వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ వాసులు ఇళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంబించింది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలో ట్రాఫిక్ను నివారించేందుకు ఇద్దరు ట్రాఫిక్ సీఐలు, ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐలు, 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం GMMAR 30 మంది అదనపు సిబ్బందిని నియమించింది. టోల్ ప్లాజాతోపాటు చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ జామ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read also: Karimnagar: నేడే కోడిపుంజు వేలం.. మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం..!
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
- Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
- Sabita Indra Reddy: తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఉందా? మాక్ అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నల వర్షం..
ఏదైనా ప్రమాదం జరిగితే రవాణాకు ఇబ్బంది కలగకుండా ప్రతి 20 కి.మీకి ఒక క్రేన్, ప్రతి 30 కి.మీకి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటే 100 లేదా వాట్సాప్ నంబర్ 8712662111లో సంప్రదించాలని భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాహనదారులు ఏమైనా ఇబ్బందులుంటే 1033 నంబర్కు సంప్రదించాలని జీఎంఆర్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోడిపందాలు నిర్వహిస్తారు. ఈ కోడిపందాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. మూడు రోజుల పాటు జరిగే పండుగను పురస్కరించుకుని ప్రజలు స్వగ్రామాలకు రావడంతో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
Ram Mandir: రామమందిరం ప్రారంభోత్సవానికి 11 రోజులే.. ప్రధాని ప్రత్యేక పూజలు..!
తాజావార్తలు
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
-
BRICS 2026: మోదీ చేతుల్లో జిన్పింగ్, పుతిన్.. బ్రిక్స్ ఫోటోతో ప్రపంచం షేక్..
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!