Panthangi Toll Plaza: ఏపీకి క్యూ కట్టిన వాహనాలు.. రద్దీగా మారిన పంతంగి టోల్ ప్లాజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Panthangi Toll Plaza: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి NH 65 సంక్రాంతి పండుగ కారణంగా రద్దీగా మారింది. నేటి నుంచి 17వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడంతో హైదరాబాద్ వాసులు ఇళ్లకు బయలుదేరుతున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంబించింది. ఈ నేపథ్యంలో చౌటుప్పల్ మండలంలో ట్రాఫిక్ను నివారించేందుకు ఇద్దరు ట్రాఫిక్ సీఐలు, ముగ్గురు ట్రాఫిక్ ఎస్ఐలు, 30 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ నియంత్రణ కోసం GMMAR 30 మంది అదనపు సిబ్బందిని నియమించింది. టోల్ ప్లాజాతోపాటు చౌటుప్పల్ మండల పరిధిలోని దండు మైలారం, దండు మల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, అంకిరెడ్డిగూడెం, పంతంగి, గుండ్లబావి క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ జామ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read also: Karimnagar: నేడే కోడిపుంజు వేలం.. మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం..!
Also Read
- Electric Vehicles: 2029 తర్వాత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకే రిజిస్ట్రేషన్స్.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Komatireddy Venkat Reddy : నేను ప్రచారానికి రాకపోయినా గెలిపించాలి.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.!
- CM Revanth Reddy : సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో ఆధ్యాత్మిక శోభ
- Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
ఏదైనా ప్రమాదం జరిగితే రవాణాకు ఇబ్బంది కలగకుండా ప్రతి 20 కి.మీకి ఒక క్రేన్, ప్రతి 30 కి.మీకి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటే 100 లేదా వాట్సాప్ నంబర్ 8712662111లో సంప్రదించాలని భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాహనదారులు ఏమైనా ఇబ్బందులుంటే 1033 నంబర్కు సంప్రదించాలని జీఎంఆర్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా కోడిపందాలు నిర్వహిస్తారు. ఈ కోడిపందాలను తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. మూడు రోజుల పాటు జరిగే పండుగను పురస్కరించుకుని ప్రజలు స్వగ్రామాలకు రావడంతో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు చర్యలు తీసుకుంటున్నారు
Ram Mandir: రామమందిరం ప్రారంభోత్సవానికి 11 రోజులే.. ప్రధాని ప్రత్యేక పూజలు..!
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!