ఇంద్రవెల్లి సభా రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపుకు నాంది అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. చరిత్ర లో నిలిచే మీటింగ్ ఇది. ఏడున్నర ఏళ్ల కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి. అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకపోవడంకు కేసీఆర్ కారణం అని తెలిపారు. కేసీఆర్ ను ఇంటికి పంపడం ఖాయం. ఇంద్రవెల్లి సభా క్యాడర్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అన్నారు.ప్రస్తుతం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ జెండా దళిత గిరిజన లకు అండగా ఉంటది అని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అయితే నిన్న ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన సభ విజయవంతమైన విషయం తెలిసిందే.