Revanth Reddy: తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TPCC Revanth Reddy for Kantachari Vardhanti Program: తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ అని రేవంత్ రెడ్డి అన్నారు. ఓయూలో తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి వర్థంతి కార్యక్రమానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోందండరాం, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకాంతాచారి 13వ వర్ధంతి ఈరోజని తెలిపారు. తెలంగాణ అంటే గుర్తుకు వచ్చేది ఉస్మానియా యూనివర్సిటీ పేర్కొన్నారు. ఉస్మానియా అంటే యువత, ఉద్యమ స్ఫూర్తి ఉన్న విద్యార్థులని పేర్కొ్న్నారు. సమాజానికి చెదలు పట్టినప్పుడు, అధికారం ఆధిపత్యం కోసం ఆలోచించినప్పుడు నిలబడి కొట్లాడిన గడ్డ ఉస్మానియా అంటూ స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
Read also: Harish Rao: కామారెడ్డిలో మెడికల్ కాలేజీని త్వరలో ప్రారంభిస్తాం
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
ఎవరు అమరులయ్యారు? ఎవరు ఉద్యమంలో కొట్లాడింది ఎవరు.? జేఏసీలు పెట్టిందెవరు.? జెండాలు కట్టిందెవరు.? అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. అధికారం ఆధిపత్యం చెలాయిస్తోంది ఎవరు.? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పెద్దలు చెప్పిన మాటను నమ్మి.. తెలంగాణ బిడ్డల పోరాటాన్ని చూసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.. సోనియా గాంధీ అని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయి అని తెలిసి కూడా సోనియమ్మ రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మబలిదానాలు చేసుకున్న వారి కుటుంబాలకు ఉద్యోగం, పది లక్షలు ఇస్తా అంటే రాజకీయాలకు అతీతంగా మద్దత్తు పలికామన్నారు. అమరుల కుటుంబాలకు నేడు ఎటువంటి సహాయం అందలేదని మండిపడ్డారు. 550మంది కంటే ఎక్కువ మంది అమరులను ప్రభుత్వం గుర్తించిందని, ఇచ్చిన జీవోల్లో అడ్రెస్ నాట్ ఫౌండ్ అని రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!