Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tpcc Chief Revanth Reddy Slams Trs Govt Over Land Issues

Revanth Reddy: ‘ధరణి’ వల్లే ఆ ఇద్దరి హత్య..

Published Date :March 2, 2022 , 3:01 pm
By Sudhakar Ravula
Revanth Reddy: ‘ధరణి’ వల్లే ఆ ఇద్దరి హత్య..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం దగ్గర ఇద్దరు రియల్టర్ల హత్య కలకలం సృష్టిస్తోంది.. భూవివాదం పరిష్కారం కోసం మాట్లాడుకుందామని పిలిచి కాల్పులు జరపగా.. ఒక రియల్టర్‌ ఘటనా స్థలంలోనే.. మరో రియల్టర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.. అయితే, ఈ హత్యలపై సంచలన వ్యాఖ్యలు చేశారు టి.పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్‌, సీఎస్ సోమేష్‌ కుమార్‌ కలిసే ధరణి పోర్టల్‌ తెచ్చారని గుర్తుచేసిన ఆయన.. ఆ పోర్టల్‌లో మొత్తం తప్పులే ఉన్నాయని.. వాటి కారణంగా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.. ఇక, నిన్ననే ఇబ్రహీంపట్నంలో ఇద్దరి రియల్టర్ల హత్య జరిగందని.. దానికి ప్రధాన కారణం ధరణి పోర్టల్‌లో లోపాలే అన్నారు.

హైదరాబాద్ చుట్టు పక్కల భూములు కాజేస్తున్నారన్నారని ఆరోపించారు రేవంత్‌ రెడ్డి.. రెవెన్యూ అధికారులు పాత యజమానులకే పట్టాలిచ్చారని.. వేల కోట్ల భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.. 20 ఏళ్ల క్రితం ఉన్న భూ యజమానులు పేర్లు ధరణిలో వస్తున్నాయని.. దీంతో భూమి కొన్న ఓనర్లు ఆగమై హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, రాష్ట్రంలో తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లకు అన్యాయం జరుగుతుందన్నారు రేవంత్‌రెడ్డి.. బీహార్ అధికారులను కేసీఆర్‌ కోటరిగా పెట్టుకున్నారన్న ఆయన.. నా మాటలకు అధికారుల నుండో.. టీఆర్ఎస్‌ నేతల నుండో విమర్శలు వస్తాయని అనుకున్నా… కానీ, బీహార్ మంత్రి… నాపై విమర్శలు చేస్తూ కేసీఆర్‌ని సమర్థించారంటూ దుయ్యబట్టారు.. దీంతో.. కేసీఆర్‌ ఏ స్థాయికి వెళ్లారు అనేది ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Mother Daughter Suicide: పెళ్లి ఇంట్లో చావు కేకలు! వరుడి నిందలతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, ఆమె తల్లి బలి..

  • Rajampeta Crime: రాజంపేటలో ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. భార్య ప్రాణాలు పోతుంటే నవ్వుతూ రికార్డ్ చేసిన భర్త!

  • Robbery: యశోద ఆసుపత్రిలో బంగారు ఆభరణాలు చోరీ.. కిలేడీ చేసిన పనికి అంతా షాక్..

  • VKB MAHILA DEATH: డెత్ మిస్టరీ..

  • SKLM MARPHING: మార్ఫింగ్ మాయ..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions