NTV Telugu Site icon

తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారు : రేవంత్‌ రెడ్డి

పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగం అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఆథమ స్థాయిలో మాట్లాడినట్లుగా ఉందని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. చట్టంలో లేకపోయినా, నమ్మకం కలిగించేలా ప్రధానులు వాఖ్యలు ఉండేవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల పట్ల చిన్నచూపుతో ప్రధాని మాట్లాడారని, మోడీ మేనేజ్మెంట్ ద్వారా పీఎం అయ్యారని ఆయన అన్నారు. గురువయిన అద్వానీని మోసం చేసిన ఘనత మోడీ ది అని ఆయన ఆరోపించారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అంటూ 1997 లో కాకినాడలో తీర్మానం చేసింది బీజేపీ అని ఆయన అన్నారు. మలి ఉద్యమంలో బలి అయిన అమరులకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రధాని దిగజారి మాట్లాడుతున్నారని, ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని విభజన కోసం సోనియాగాంధీ నిర్ణయం తీసుకుందని రేవంత్‌ అన్నారు.

తెలంగాణ జాతిని ప్రధాని అవమానించారని, ప్రధానికి చదువు సంధ్య లేదు.. మోడీ ప్రధాని అవటం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. అంతేకాకుండా పార్లమెంట్ లో బిల్స్ ఓటింగ్ జరగాల్సి వస్తే, సభ తలుపులు ముస్తారని, ఇది చట్ట ప్రక్రియ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలను సైతం మోడీ వంచించాడు.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు.. బంగాళాఖాతంలో దూకి ప్రధాని ఆత్మహత్య చేసుకోవాలి.. తెలంగాణా కోసం పదవి త్యాగం చేయకుండా, మోడీ వెనుక దాక్కున్నాడు.. కిషన్ రెడ్డి రాజీనామా చెయ్యాలి.. మోడీ తెలంగాణ ద్రోహి, వ్యతిరేకి అని నిరూపించుకున్నాడు అని రేవంత్‌ ధ్వజమెత్తారు. మోడీ మాట్లాడుతుంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలు నోరెత్తటం లేదని, మోడీ ప్రసంగాన్ని కాంగ్రెస్ ఖండిస్తుందని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.