Muthyam Dhara: జలపాతం వద్ద చిక్కుకొన్న పర్యాటకులు సేఫ్.. కాపాడిన NDRF బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muthyam Dhara: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం గ్రామ సమీపంలోని ముత్యాంధర జలపాతాలను చూసేందుకు వెళ్లిన 60 మంది పర్యాటకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నారు.. మొత్తం 84 మంది పర్యాటకులు జలపాతం వద్దకు వెళ్లగా.. వీరిలో 24 మంది తిరిగొచ్చారు. 8 గంటలపాటు నీటిలో ఉంటూ కుండపోత వర్షంలో గడిపారు. అటవీలో చిక్కుకున్న పర్యాటకులను ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రం నుండి క్షేమంగా వారి గమ్యస్థానాలకు ఈ తెల్లవారి జామున 4 గంటలకు పంపించామని పర్యాటక మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఈ తెల్లవారు జామున NDRF, జిల్లాకు చెందిన గజ ఈతగాళ్ళ, రెస్క్యూ టీంలు , పోలీసులు, అటవీ శాఖ,రెవెన్యూ అధికారుల సహాకారంతో ఘటన స్థలం చేరుకొని 4 గంటలకు వాగు ఉధృతం నుండి సుమారు 60 మంది పర్యాటకులని దాటించి వెంకటాపురం మండల కేంద్రానికి జిల్లా అధికారులు తీసుకువచ్చారని తెలిపారు.
అనంతరం వెంకటాపురం మండల కేంద్రం నుండి వారి ప్రాంతాలకు సురక్షితంగా పంపించారు. ముత్యం ధార జలపాతం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగు దాటలేక అటవీలో సుమారు 60 మంది పర్యాటకుల చిక్కుకున్న సమాచారం వచ్చిన వెంటనే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరంతరం రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులతో సమీక్షించారు, తక్షణం స్పందించారు. అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతాల వద్దకు అటవీ శాఖ అధికారాల అనుమతి లేకుండా పర్యాటకులు వెళ్ళడం సురక్షితం కాదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యాటకులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయన్నారు .జలపాతాల వద్దకు వెళ్లేందుకు పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- KTR : బండి భగీరథ్ కేసుపై కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
Read also: Kajal Agarwal : హాట్ డ్రెస్ లో దేవ కన్యలా మెరిసిన కాజల్..
బుధవారం సెలవు దినం కావడంతో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు పర్యాటకులు ములుగు జిల్లాలోని జలపాతాలను సందర్శించేందుకు వెళ్లగా.. మరికొందరు వీరబద్రవరం గ్రామ సమీపంలోని ముత్యంధర జలపాతాలను సందర్శించేందుకు వెళ్లి.. అక్కడి జలపాతాల్లో ఈత కొడుతూ ఆనందించారు. మార్గమధ్యంలో గగ్గేణి నది పొంగిపొర్లింది..మధ్యలో మరో రెండు కాల్వలు ప్రవహిస్తున్నాయి.. దీంతో పర్యాటకులు అడవిలో చిక్కుకున్నారు.. దిక్కుతోచని కేకలు వేశారు.. మొత్తం 60 మంది మాత్రమే అడవిలో చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరి సెల్ఫోన్లు పనిచేస్తున్నాయని..ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. స్నేహితులకు సమాచారం అందించారు..
ఈ క్రమంలో ప్రభుత్వ యంత్రాంగం తక్షణ సహాయక చర్యలు చేపట్టింది.. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కుండపోత వర్షంతో అతి కష్టం మీద.. దారిలో వరద పొంగి ప్రవహిస్తున్న తాడు సహాయంతో అడవిలోకి వెళ్లి వారిని రక్షించారు. 60 మందిని సురక్షితంగా వీరభద్రవరం తీసుకొచ్చారు.. వారికి అక్కడే భోజనాలు ఏర్పాటు చేసి స్వగ్రామాలకు పంపించారు.. తమను కాపాడేందుకు కృషి చేసిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.. తమ ప్రాణాలను కాపాడిన గ్రామస్థులకు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. అడవిలో ఎనిమిది గంటలపాటు నరకయాతన అనుభవించామని గుర్తు చేసుకుంటూ దుఃఖంలో మునిగిపోయారు.. ఇది మాకు పునర్జన్మ. మొత్తం మీద ఆపరేషన్ సక్సెస్ కావడంతో ఆ 60 మంది సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Heavy Rain Bhadradri: భద్రాద్రి కొత్తగూడెంలో విషాదం.. వాగులో కొట్టుకుపోయిన తల్లీ కూతుళ్లు
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..