తెలంగాణలో కరోనా రోజువారి కేసులు కొంచెం పెరిగాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 31,054 శాంపిల్స్ పరీక్షించగా… 137 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఒక్క కరోనా బాధితుడు మృతిచెందారు. ఇదే సమయంలో 173 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,74,318కు చేరుకోగా… రికవరీ కేసులు 6,66,682కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 3,979కు చేరినట్టు బులెటిన్లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,657 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. తాజా, కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 48 కొత్త కేసులు వెలుగు చూశాయి.
తెలంగాణ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
