Tirupati Reddy: హాట్ కేక్లా మెదక్ అసెంబ్లీ టిక్కెట్.. కాంగ్రెస్ పార్టీకి తిరుపతి రెడ్డి రాజీనామా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మెదక్ అసెంబ్లీ టిక్కెట్ను తిరుపతిరెడ్డి ఆశించారు. అయితే ఈ స్థానం నుంచి మైనంపల్లి హన్మంతరావు తనయుడు రోహిత్కు టిక్కెట్టు దక్కే అవకాశం ఉండటంతో కాంతారెడ్డి తిరుపతిరెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
మైనంపల్లి హన్మంతరావు గత వారం బీఆర్ఎస్కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నవంబర్ 28న న్యూఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్లో చేరారు. మల్కాజిగిరి నుంచి మైననంపల్లి హన్మంతరావు, మెదక్ నుంచి హన్మంతరావు కుమారుడు రోహిత్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. మైనంపల్లి హన్మంతరావు 2009-2014 వరకు మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. రోహిత్ కొంతకాలంగా మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రోహిత్ మెదక్ అసెంబ్లీ స్థానంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెదక్ నుంచి బీఆర్ఎస్ టికెట్ తన కుమారుడు రోహిత్కు ఇవ్వాలని మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు. కానీ, బీఆర్ఎస్ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
Also Read
- Telangana Civil Supplies: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 31 వరకే ఛాన్స్!
- Rega Kantha Rao: "పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు".. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
- Hyderabad: ప్రధాని మోడీ AI మార్ఫింగ్ వీడియో.. మెటా హెడ్పై కేసు నమోదు..
- Formula E Case: ఫార్ములా-ఈ రేస్ కేసులో నేడు కీలక విచారణ.. ఏసీబీ కోర్టుకు కేటీఆర్?
దీంతో మంత్రి హరీశ్ రావుపై మైనంపల్లి హన్మంతరావు విమర్శలు గుప్పించారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన అనుచరులతో సమావేశాలు నిర్వహించి మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. అయితే మైనంపల్లి హన్మంతరావు కుమారుడికి మెదక్ అసెంబ్లీ టికెట్ కేటాయించే అవకాశం ఉందని తేలడంతో తిరుపతిరెడ్డి కాంగ్రెస్ను వీడారు. డబ్బు మూటలు ఇచ్చిన వారికే పార్టీ టిక్కెట్లు ఇస్తారా లేక కర్ణాటక మాదిరి కాదా అని ప్రశ్నించారు. ఎంతో కాలంగా పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా డబ్బున్న వారికి టిక్కెట్లు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. పార్టీ అభ్యర్థిగా మొదట హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు వేరొకరికి టికెట్ కేటాయించడంపై తిరుపతిరెడ్డి ప్రశ్నించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపిన రాజీనామా లేఖలో ఆయన ఈ అంశాలను ప్రస్తావించారు.
Tiger Nageswara Rao: ‘హేమ లత లవణం’గా రేణు దేశాయ్…
తాజావార్తలు
-
Box Office Posters: టాలీవుడ్లో రూ.100 కోట్ల మోజు.. ఫేక్ కలెక్షన్ పోస్టర్లతో కొత్త ట్రెండ్?
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Pakistan: పాక్లో తిరుగుబాటు భయం..! బొద్దింకలు ఏకమైతే అన్నీ తలకిందులే.. యువతపై హోం మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Anil Ravipudi: త్రివిక్రమ్ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!