Telangana Rain: నేడు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ కేంద్రం వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Rain: మండుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రానికి పశ్చిమ, నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో నేడు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాల మీదుగా విస్తరించేందుకు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుండి దక్షిణ అంతర్గత కర్ణాటకకు, విదర్భ మరియు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో కదులుతోంది. ఇవాళ ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుండి గంటకు 4 నుండి 08 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read
- TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
- Telangana Congress: కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం.. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్..
- Lingamneni Ramesh Son: ఎంపీ లింగమనేని కుమారుడు సంజూష్పై కేసు.. నేడు పోలీసుల విచారణకు హాజరు!
- YS Jagan: వైఎస్ జగన్కు హైదరాబాద్లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
శుక్రవారం వాతావరణం పొడిగా ఉండటంతో సాధారణ ఉష్ణోగ్రత 2 నుండి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గరిష్టంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించారు. హైదరాబాద్ పరిసర జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో బుధవారం 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్లో 42.8 డిగ్రీలు, రామగుండం, నిజామాబాద్లో 42.2 డిగ్రీలు, నల్గొండ, ఖమ్మం, హనుమకొండ జిల్లాల్లో 42 డిగ్రీలు, మెదక్లో 41.2 డిగ్రీలు, మహబూబ్నగర్లో 39.9, భద్రాచలంలో 39.4, హైదరాబాద్లో 39.4, 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
CM KCR: నేడు సచివాలయంలో కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష.. పాల్గొననున్న కలెక్టర్లు, ఎస్పీ, సీపీలు
తాజావార్తలు
-
TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్పై భారీ డిస్కౌంట్ ప్రకటన..
-
Varanasi Movie Update: ‘వారణాసి’కి రాజమౌళి డెడ్లైన్.. పక్కా ప్లాన్ ప్రకారమే!
-
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Bethlehem Kudumba Unit : 2026 ఓనమ్ విన్నర్గా నివిన్ పౌలి.. ‘బెత్లేహెమ్ కుటుంబ యూనిట్’ బ్లాక్ బస్టర్
ట్రెండింగ్
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!