Asifabad: కాగజ్ నగర్ పులులు చంపిన కేసు.. ముగ్గురు నిందితుల్లో ఒకరు 11 ఏళ్ల బాలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asifabad: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అడవుల్లో ఏం జరుగుతోంది..? ఒక పులి మృతి చెందిన రెండు రోజులకే మరో పులి మృతి చెందడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మరో నాలుగు పులులు అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కాగజ్ నగర్ అడవుల్లో ఏం జరుగుతోందో అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయి. మొదటి పులి మృతి చెందిన రోజు నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 70 మంది సిబ్బందితో పాటు అటవీశాఖాధికారులు కాగజ్ నగర్ రేంజ్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో పులుల జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు పులుల మృతి కేసులో ఎట్టకేలకు మిస్టరీ ఛేందించారు. పులులను చంపింది ముగ్గురుని అదుపులో తీసుకున్నారు. అయితే ముగ్గురిలో ఒకరు మైనర్ బాలుడు ఉండటం గమనార్హం. పులులను చంపాలనే ఉద్దశ్యంతోనే పశు కళేబరంపై విషం చల్లినట్లు నిందితులు విచారణలో అంగీకరించారని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు పోలీసులు.
Read also: Red Sea Crisis: హౌతీ రెబల్స్ నియంత్రణలో ఉన్న మరో స్థావరంపై యూఎస్ సైన్యం దాడి
Also Read
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
- TG20 తొలి ఛాంపియన్గా 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్'.. ఖమ్మం ఏసెస్పై 6 వికెట్లతో ఘన విజయం.!
- Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
- Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
అదుపులో తీసుకున్న ముగ్గురు నిందితులు ఆసిఫాబాద్ డివిజన్ వాంకిడి మండలం వెల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రెంగరీట్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. కోవా గంగు, ఆత్రం జల్ పతితోపాటు 11 ఏళ్ల మైనర్ బాలుడు పులులపై విషప్రయోగం చేసిన వారిలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులను నిర్ధారించారు. చనిపోయిన పశువుపై కళేబరంపై విషం చల్లడంతో.. ఆ మాంసాన్ని తీన్న రెండు పులులు చనిపోయాయి. ఈ విషయాన్ని విచారణలో నిందితులు అంగీకరించిన్లు ఆసిఫాబాద్ డీఎఫ్వో నీరజ్ కుమార్ టేబ్రీవాల్ వెల్లడించారు. పశువులపై పులి దాడి చేస్తుందడం, వాటిని చంపేయడం సహించలేక పోయామని అన్నారని తెలిపారు. ఎలాగైనా పులులను చంపేందుకు ప్లాన్ వేశామన్నారు. అందుకే పులులను విషం పెట్టి చంపినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలును సైతం తాము సేకరించామని చెప్పారు. ఈ మేరకు సదరు వ్యక్తులను శుక్రవారం కోర్టులో హాజరు పరిసచినట్లు వెల్లడించారు. వీరిలో గంగు, జలపతికి న్యాయస్థానం 12 రోజుల జుడీషియల్ కస్టడీ విధించినట్లు తెలిపారు. ముగ్గురిలో మైనర్ను పేరెంటల్ బాండ్ పై రిలీజ్ చేసిందన్నారు. పులులు మృతి ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఇంకా పూర్తిస్థాయి సమాచారం తర్వాత వెల్లడిస్తామని డీఎఫ్ వో వెల్లడించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు
తాజావార్తలు
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
-
Indian Railways Viral Train Puja: కదులుతున్న రైలులో పూజలు?.. రైల్వే శాఖ క్లారిటీ..
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Akshay Kumar: ఆ హీరోయిన్ నా మొదటి క్రష్.. క్లైమాక్స్ లేకుండానే సినిమా.. అక్షయ్ షాకింగ్ రివీల్
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?