Red Sea Crisis: హౌతీ రెబల్స్ నియంత్రణలో ఉన్న మరో స్థావరంపై యూఎస్ సైన్యం దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Houthi rebels: ఎర్ర సముద్రంలో యుద్ధం జరిగే అవకాశం ఉంది. హౌతీలపై అమెరికా దాడి కొనసాగుతుంది. యెమెన్లో హౌతీ బలగాలపై అమెరికా బలగాలు అదనపు దాడిని జరుపుతున్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అంతకు ముందు, ఎర్ర సముద్రం షిప్పింగ్పై దాడి చేసే హౌతీ సైన్యం సామర్థ్యాన్ని తగ్గించడానికి అమెరికా దేశంలోని 30 ప్రదేశాలలో ఈ దాడులు చేసింది. అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ హెచ్చరించారు. హౌతీ సైనిక స్థావరాలపై అమెరికా బలగాలు వాయు, సముద్ర మార్గాల ద్వారా ఉధృతంగా దాడులు చేస్తున్నాయి.
Read Also: Guntur Kaaram: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ డే 1… ఆర్ ఆర్ ఆర్ రికార్డ్స్ కూడా లేచాయ్
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
ఇక, నిన్న తొలి రోజు 28 చోట్ల దాడులు చేయగా.. 60కి పైగా హౌతీ రెబల్స్ కు చెందిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇక, శనివారం ఉదయం హౌతీలకు చెందిన మరో ప్రదేశాన్ని గుర్తించింది. రాడార్ సైట్.. ఇది ఇప్పటికీ సముద్ర ట్రాఫిక్కు ముప్పుగా ఉంది అని ఓ అధికారి తెలిపారు. అంతకుముందు శుక్రవారం నాడు హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని యూఎస్ తో పాటు బ్రిటన్ సైనికులు వైమానిక దాడులు నిర్వహించాయి. యెమెన్ చుట్టూ ఉన్న ఎర్ర సముద్రంతో పాటు ఏడెన్ గల్ఫ్లోని ప్రాంతాలను రాబోయే 72 గంటల పాటు తప్పించుకోవాలని యూఎస్ జెండాతో కూడిన నౌకలను అమెరికా నేవీ హెచ్చరించింది. హౌతీలు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తారని తాము భావిస్తున్నామని యూఎస్ మిలిటరీతో పాటు వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు.
Read Also: Lok Sabha Elections: నేడు ఇండియా కూటమి కీలక సమావేశం
కీలకమైన ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై ఇటీవల జరిగిన డ్రోన్, క్షిపణి దాడులకు ప్రతిస్పందనగా యూఎస్ నేతృత్వంలోని వైమానిక దాడిలో ఐదుగురు మరణించాగా, మరో ఆరుగురు గాయపడ్డారని హౌతీలు తెలిపారు. యెమెన్లోని హౌతీ నియంత్రణ ప్రాంతాల్లోని 28 వేర్వేరు ప్రాంతాల్లో రెండు దశల్లో దాడులు నిర్వహించినట్లు అమెరికా ప్రకటించింది.
తాజావార్తలు
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!