Hyd Boy Murder Mystery: దుర్గానగర్ బాలుడి మర్డర్ మిస్టరీ.. హత్యచేసింది అతనా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyd Boy Murder Mystery: హైదరాబాద్లోని దుర్గానగర్ ప్రాంతంలో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. బాలుడు కనిపించకుండా పోయిన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఓ వృద్ధుడిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. స్థానిక వృద్ధుడితో కలిసి బాలుడు వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డైంది. బాలుడి అంత్యక్రియల అనంతరం నిందితుడు ఆ ప్రాంతానికి తిరిగి రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. బాలుడిని తానే హత్య చేసినట్లు వృద్ధుడు అంగీకరించడంతో వారు షాక్కు గురయ్యారు. బాలుడిపై అత్యాచారం చేసి, ఎదురు తిరిగితే చంపేశానని ఒప్పుకున్నాడు.
Read also: Jio New Plan 2024: రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్లాన్.. అదనపు డేటా, 14 ఓటీటీలు ఫ్రీ!
Also Read
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- Bhatti Vikramarka : కర్ణాటకలో గోల్డ్ హంట్.. దేవదుర్గ గనిపై భట్టి ఫోకస్..
- TGSRTC : రాఖీ పండుగకు టీజీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. 5,000 స్పెషల్ బస్సులు
జూబ్లీహిల్స్లోని దుర్గానగర్లో గత బుధవారం నాలాలో బాలుడు శవమై కనిపించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలుడి కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. 5వ రోడ్డులోని దుర్గాభవానీనగర్ బస్తీలో నివాసముంటున్న ముదావత్ రమేష్, కవిత దంపతుల రెండో కుమారుడు కార్తీక్ అలియాస్ పాండు(10) గత మంగళవారం రాత్రి అదృశ్యమయ్యాడు. బుధవారం ఉదయం స్థానికులు వెతకగా పార్కులోని డ్రైనేజీలో శవమై కనిపించాడు. బాలుడిని ఎవరో హత్య చేశారని తల్లి ఆరోపించింది. ఇదే బస్తీకి చెందిన మన్యం నాయక్ (42) గత కొంతకాలంగా కనిపించకుండా పోయాడు. 15 రోజుల క్రితం బస్తీకి బాలుడిని కలిశాడు. అయితే గతంలో బాలుడి కుటుంబంతో గొడవలు జరిగినట్లు గుర్తించారు.
Read also: MLC Kavitha: ఆ.. జీవోను తక్షణమే వెనక్కి తీసుకోండి.. ఖర్గే కు ఎంఎల్సీ కవిత లేఖ
బాలుడు మృతి చెందినప్పటి నుంచి ఫోన్లో కూడా నాయక్ అందుబాటులో లేకపోవడంతో అనుమానం వచ్చింది. బాలుడి అంత్యక్రియల అనంతరం కొండపైకి వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నిందితుడు గత మంగళవారం రాత్రి పార్కులో ఆడుకుంటున్న బాలుడిని తనతో పాటు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలుడు ఎదురు తిరగడంతో గొంతు నులిమి రాయితో తలపై కొట్టి హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని డ్రైనేజీలో పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కుమారుడి ద్వారా పోలీసులు నేరం వివరాలు రాబట్టారు. చిన్నారులపై అత్యాచారం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి భార్య చనిపోయిన తర్వాత ఇంటికి రావడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
YCP- TDP Rebel MLAs: టీడీపీ- వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. ఈసారి రాకపోతే
- Tags
- Boy
- boy murder
- hyd
- murder
- mystery
తాజావార్తలు
-
Ghamasaan OTT: అర్షద్ వార్సీ, ప్రతీక్ గాంధీ ఢీ.. అదరగొట్టిన ‘ఘమాసాన్’ ట్రైలర్ .. నేరుగా ఓటీటీలోకే
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
ట్రెండింగ్
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!