రేపు టీఆర్స్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం 4గంటలకు శాసనసభ పక్షం భేటీ కానుంది. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రప్రభుత్వ తీరుపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు, రాష్ర్ట బీజేపీ మరో విధంగా వ్యవహరిస్తుందని.. దీంతో రైతులు అయోమయా నికి గురవుతున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఇప్పటికే ధర్నాలకు సైతం పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో భవి ష్యత్ కార్యచరణను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి, బీజేపీ వైఖరితో పాటు ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా, ఢీల్లీ స్థాయిలోను ఆందోళనలను ఏ రూపంలో కొనసాగించాలో చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా టీఆర్ఎస్ ఈనెల12 ధర్నా నిర్వహించింది. జిల్లాలు, నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో.. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈధర్నాలో పాల్గొని రైతులకు మద్దతునిచ్చారు. దేశమంతా ధాన్యం కొనుగోలు చేసే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇప్ప టికే కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులపైనా కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
