NTV Telugu Site icon

తెలంగాణలో పలు జిల్లాలకు అదనపు కలెక్టర్ల కేటాయింపు

రాష్ట్ర వ‌రుస‌గా ఐపీఎస్, ఐఏఎస్, అద‌నపు క‌లెక్ట‌ర్ హోదా, నాన్ కేడ‌ర్ అధికారుల‌ను బ‌దిలీ చేయ‌డం, వేయిటింగ్ లో ఉన్న వారికి పోస్టింగుల‌ను ఇస్తుంది. శుక్రవారం రాత్రి రాష్ట్ర వ్యాప్తంగా ప‌లు జిల్లాల‌కు అద‌న‌పు కలెక్టర్లను నియ‌మిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం.. జగిత్యాల అద‌న‌పు కలెక్టర్‌గా బీఎస్‌ లత, నారాయణ్‌పేట్‌ అదనపు కలెక్టర్‌గా జి.పద్మజారాణి, రాజ‌న్న సిరిసిల్లా అద‌న‌పు కలెక్టర్‌గా ఖీమానాయక్‌కు పోస్టింగ్‌లను రాష్ట్రప్రభుత్వం ఇచ్చింది. అలాగే వ‌రంగ‌ల్ అద‌న‌పు కలెక్టర్‌గా కె . శ్రీ‌వాస్తవ, ములుగు అద‌న‌పు కలెక్టర్‌గా గా వై వి గ‌ణేష్, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ అద‌న‌పు కలెక్టర్‌గా ఎం డేవిడ్ ల‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Read Also: తెలంగాణ‌కు వ‌ర్ష సూచ‌న‌.. మూడు రోజులు వ‌ర్షాలే..!

ఇప్పటి వ‌ర‌కు నాగ‌ర్ క‌ర్నూల్ అద‌న‌పు కలెక్టర్‌గా ఉన్న పీ శ్రీ‌నివాస‌రెడ్డిని సిద్ధిపేటకు బదీలీ చేశారు. అంతే కాకండా.. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ పాలనాధికారి చంద్రమోహన్‌ను కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా బదీలీ చేశారు. చంచ‌ల్ గూడ ప్రభుత్వ ముద్రణాలయం పాలనాధికారిగా ఉన్న కె. అనిల్‌కుమార్‌తో పాటు హైద‌రాబాద్ జిల్లా భూపరిరక్షణ ఎన్డీసీగా బీ. సంతోషిని లను ప్రభుత్వం నియమించింది. వీరితో పాటు ప‌లువురు నాన్ కేడ‌ర్ అధికారుల‌ను కూడా బ‌దిలీ చేశారు.