KCR: కేసీఆర్కు నోటీసులు.. వివరణకు రేపు లాస్ట్..
- విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు
- వివరణకు రేపు (జూన్ 15) ఆఖరి రోజు
- ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ కు జూలై 30 వరకు సమయం
- జాన్ 15 లోపు మీ వివరణ ఇవ్వాలని ఆదేశం
- కమిషన్ ముందు విచారణకు రావాల్సిందే -జస్టిస్ నరసింహ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Chief KCR: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని న్యాయ కమిషన్ గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని జూన్ 15 వరకు గడువు విధించింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. అందుకు కమిషన్ అంగీకరించలేదు. గడువు ముగిసే విషయాన్ని న్యాయ కమిషన్ అధినేత జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. దీంతో జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.జూన్ 16 తర్వాత ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.
Read also: Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Also Read
- OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- Off The Record : కాంగ్రెస్ పార్టీలో కుంపటి రాజేసిన 4 కోట్ల విలువైన భూమి
కమిషన్ మరో లేఖ రాసి మరో డెడ్ లైన్ పెడుతుందా..? లేక నిర్ణీత గడువులోగా సమాధానం రాకపోవడానికి కారణం చూపుతూ సమన్లు జారీ చేస్తుందా..? నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ చర్యలు తీసుకుంటుందా? ఇవీ కొనసాగుతున్న చర్చలు. అయితే కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి అక్కడ నేరుగా విచారణకు అవకాశం ఉంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్ను నియమించింది. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి కాగా.. నేడు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపడం గమనార్హం.
Nabha Natesh: అబ్భా అనిపిస్తున్న నాభ నటేష్ అందాలు..
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!