KCR: కేసీఆర్కు నోటీసులు.. వివరణకు రేపు లాస్ట్..
- విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ కు నోటీసులు
- వివరణకు రేపు (జూన్ 15) ఆఖరి రోజు
- ఎన్నికల దృష్ట్యా కేసీఆర్ కు జూలై 30 వరకు సమయం
- జాన్ 15 లోపు మీ వివరణ ఇవ్వాలని ఆదేశం
- కమిషన్ ముందు విచారణకు రావాల్సిందే -జస్టిస్ నరసింహ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Chief KCR: తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఇందుకోసం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని న్యాయ కమిషన్ గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని జూన్ 15 వరకు గడువు విధించింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ కోరగా.. అందుకు కమిషన్ అంగీకరించలేదు. గడువు ముగిసే విషయాన్ని న్యాయ కమిషన్ అధినేత జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి మీడియాకు వెల్లడించారు. దీంతో జూన్ 15 వరకు కేసీఆర్ నుంచి సమాధానం రాకపోతే కమిషన్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.జూన్ 16 తర్వాత ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది.
Read also: Today Gold Price: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Also Read
- Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధులు విడుదల!
- KTR: సీఎం సవాల్ విసిరారు, మధ్యలో జూపల్లి వచ్చారు.. కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది!
- Congress vs BRS: బావ–బామ్మర్ది ఇద్దరూ గన్పార్క్కు రండి.. ఒకేసారి సమాధానం ఇస్తా.. జూపల్లి ఛాలెంజ్!
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
కమిషన్ మరో లేఖ రాసి మరో డెడ్ లైన్ పెడుతుందా..? లేక నిర్ణీత గడువులోగా సమాధానం రాకపోవడానికి కారణం చూపుతూ సమన్లు జారీ చేస్తుందా..? నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ చర్యలు తీసుకుంటుందా? ఇవీ కొనసాగుతున్న చర్చలు. అయితే కేసీఆర్ ఇచ్చే వివరణను బట్టి అక్కడ నేరుగా విచారణకు అవకాశం ఉంది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్ను నియమించింది. ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. నిన్న మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి కాగా.. నేడు మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు పంపడం గమనార్హం.
Nabha Natesh: అబ్భా అనిపిస్తున్న నాభ నటేష్ అందాలు..
తాజావార్తలు
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
-
Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
-
Anirudh: బక్కోడు మాములోడు కాదుగా!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Rahul Samit: రాహుల్ సమిత్ మెరుపులు.. ద్రవిడ్ శైలి.. 360 డిగ్రీ బ్యాటింగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?