ఎల్కతుర్తి – సిద్ధిపేట రోడ్డు విస్తరణ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తి -సిద్ధిపేట (ఎన్-765 డి.జి) రోడ్డు విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషి ఫలించింది. ఈ రోడ్డు విస్తరణ పనులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక, సాంకేతిక పరమైన అనుమతులకు ఆమోదం తెలపడంతో పాటు రూ.578.85 కోట్లను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఫలితంగా ఎన్ హెచ్-765 డి.జి పరిధిలోని ఎల్కతుర్తి-సిద్ధిపేట విస్తరణ పనుల్లో భాగంగా మొత్తం 63.641 కి.మీల ( 69/978 నుండి 133/619 వరకు) మేరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. కేంద్రం అన్ని రకాల అనుమతులు తెలపడంతో ఇక పనులు మొదలు కావడమే మిగిలి ఉంది. ఈ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రెండు మేజర్ బ్రిడ్జిలను, 6 మైనర్ బ్రిడ్జిలను పునర్ నిర్మించనున్నారు. వీటితో పాటు కొత్తగా 1 మేజర్, 26 మైనర్ బ్రిడ్జిలను కూడా నిర్మించాల్సి ఉంటుంది.
Also Read
- CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Ameerpet Fire Accident: అగ్ని ప్రమాదానికి కారణం ఇదే.. ప్రత్యక్ష సాక్షుల విస్తుపోయే నిజాలు..!
- Hyderabad: అమీర్పేట్లో భారీ అగ్ని ప్రమాదం.. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు
Read Also: దమ్ముంటే వనదేవతల జాతరకు వెయ్యికోట్లు తీసుకురా.. బండి సంజయ్పై ఎంపీ కవిత ఫైర్
వాస్తవానికి ఎల్కతుర్తి- సిద్ధిపేట విస్తరణ పనులు చేపట్టాలంటూ బండి సంజయ్ కుమార్ గత కొన్ని నెలలుగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిలో భాగంగానే పలుమార్లు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఎల్కతుర్తి – సిద్ధిపేట విస్తరణ పనులకు కేంద్రం ఆమోదం తెలపడం పై హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలకు ఆయన ప్రత్యేకంగా క్రుతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందనడానికి ఈ రోడ్డు విస్తరణ పనులకు నిధుల మంజూరే నిదర్శనమని ఆయన అన్నారు. ఈ రోడ్డు విస్తరణ పనులు తొందరగా పూర్తయితే కరీంనగర్, సిద్ధిపేట తదితర ప్రాంతాల ప్రజల ప్రయాణ ఇబ్బందులు తొలగిపోవడంతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు మెరుగుపడతాయని బండి సంజయ్ తెలిపారు.
తాజావార్తలు
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!