Bhadradri: నార్మల్ డెలివరీ అన్నారు.. మందులు ఇచ్చారు.. నాబిడ్డను చంపారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ గవర్నమెంట్ హాస్పిటల్ లో దారుణం జరిగింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ తల్లి బిడ్డను కోల్పోయి కన్నీరుమున్నీరైంది. ప్రసవం కోసం వచ్చి కడుపులోనే బిడ్డను కోల్పోడంతో ఆతల్లి తల్లడింది. ఈఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.
విజయ కుమారికి అనే గర్భవతికి ప్రసవం కోసం ఈనెల 4న డేట్ ఇచ్చారు డాక్టర్లు. హాస్పటల్ లో ప్రసవం కోసం నాలుగు రోజుల క్రితం విజయ కుమారి అడ్మిట్ అయ్యింది. నార్మల్ డెలివరీ చేయాలనే పేరుతో నిన్నటి వరకు డాక్టర్లు ప్రసవం చేయలేదు. నార్మల్ డిలివరి కోసం గత నాలుగు రోజులుగా పేషెంట్ కు సిబ్బంది మందులు ఇస్తూవచ్చారు.
Also Read
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
మందులు వేసుకున్నాక మహిళకు తీవ్రమైన రక్తస్రావం అవడంతో.. ఆమె నరకయాతన అనుభవించింది. సిబ్బందికి తెలుపడంతో.. హుటాహుటిన సిబ్బంది అర్థరాత్రి విజయకుమారిని ఆపరేషన్ ధియేటర్ తరలించారు. కడుపులోని శిశువును బయటకు తీశారు. కానీ శిశువు అప్పటికే మృతిచెందింది. కడుపులోనే శిశువు మృతి చెందిందని డాక్టర్లు నిర్దారించారు. దీంతో విజయకుమారి తల్లిడిల్లింది. డాక్టర్లు నిర్లక్ష్యమే నాబిడ్డను బలితీసుకుందని వాపోయింది. ప్రభుత్వ అవార్డుల కోసం తమ బిడ్డను బలిచేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితలు డిమాండ్ చేశారు.
కాగా.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై నార్మల్ డెలివరీలు చేయిస్తే రూ. 3000 పారితోషకం అందజేస్తామని హరీష్ రావు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే.. ఆశా వర్కర్లు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, వైద్య వర్గాలు నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని, ప్రజారోగ్యం కోసం మార్పు తెవాలని ఆయన సూచించారు. రాబోయే రోజుల్లో సిజేరియన్లను ప్రోత్సహించకూడదని కోరారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు పెరగాలని ఆయన అన్నారు. తెలంగాణలోని అన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నార్మల్ డెలివరీలు ఎక్కువగా పెరగాలి.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తేడా ఏమిటో ప్రజలకు తెలియాలి. ఇటీవల కాలంలో సిజేరియన్లు భారీగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో సిజేరియన్లను ప్రోత్సహించకూడదని. నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాలని. రాష్ట్రవ్యాప్తంగా నార్మల్ డెలివరీలు చేయించేవారికి రూ. 3000 పారితోషకాన్ని అందజేస్తాం.” అని హరీశ్ ప్రకటించిన విషయం తెలిసిందే దీంతో వైద్యులు పారితోషకం కోసమే శిశువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
Jubilee Hills Pub Gang Case: ఫిర్యాదు ఇచ్చారని తెలియగానే అందరం ఎస్కేప్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!