Group2 Edit Option: గ్రూప్-2 అభ్యర్థులు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలే ఛాన్స్..
- కొనసాగుతున్న గ్రూప్ 1-2-3 మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ..
- దరఖాస్తులో నమోదు చేసిన వివరాలలో తప్పులను సరిదిద్దడానికి ఎడిట్ ఆప్షన్..
- గ్రూప్-2 విద్యార్థులకు ఈ అవకాశం ఈరోజు సాయంత్రం వరకే ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group2 Edit Option: తెలంగాణ జాబ్ జాతర కొనసాగుతుంది. ఓ వైపు గ్రూప్ 4 పోస్టుల అభ్యర్థుల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. ఇక మరోవైపు గ్రూప్ 1,2,3 మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 పోస్టుల భర్తీకి డిసెంబర్ 29, 2022న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 783 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ క్రమంలో గ్రూప్ 2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ భారీ అలర్ట్ ఇచ్చింది. దరఖాస్తులో నమోదు చేసిన వివరాలలో తప్పులను సరిదిద్దడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వబడింది. ఈ అవకాశం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. దీంతో అధికారులు గ్రూప్-2 విద్యార్థులకు ఈరోజు సాయంత్రం వరకే ఈ అవకాశం ఉంటుందని వెల్లడించారు. మళ్లీ ఈ అవకాశం కోసం లింక్ ఓపెన్ చేసిన ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.
Read also: Bike Thieves: పార్క్ చేసిన వాహనాలే టార్గెట్.. సీసీ కెమెరాలో దృశ్యాలు
Also Read
- Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
- Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
- TG EAPCET 2026: తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్ విద్యార్థుల హవా
- Bandi Bhagirath Arrest: కరీంనగర్ నుంచి ఢిల్లీ దాకా వేట.. బండి భగీరథ్ అరెస్ట్పై పోలీసుల అధికారిక ప్రకటన
గ్రూప్ 2 పరీక్షలు గతేడాది పూర్తి కావాల్సి ఉంది. కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇటీవల టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2024, ఆగస్టు 7 మరియు 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో లక్షలాది మంది ఉద్యోగార్థులు పుస్తకాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అయితే గ్రూప్-2 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నమోదు చేసిన వివరాల్లో తప్పుల సవరణకు టీజీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియ జూన్ 16న ప్రారంభమైంది. ఈరోజు అంటే జూన్ 20 సాయంత్రం 5 గంటలకు గడువు ముగుస్తుంది. అంటే గ్రూప్ 2 అభ్యర్థులు తమ దరఖాస్తును సవరించేందుకు మరో కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఇంకా తమ వివరాలను సరిదిద్దుకోని వారు వెంటనే సరిచేయాలి. లేదంటే టీజీపీఎస్సీ సవరణకు మరో అవకాశం ఉండదని వెల్లడించింది. ఇప్పటివరకు ఎడిట్ చేయని వారు నేటి ముగింపు సమయానికి ముందే వివరాలను సరిచేయాలని కమిషన్ కోరింది. ఆ తర్వాత పొరపాట్లు జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఎడిటింగ్ పూర్తయిన తర్వాత పిడిఎఫ్ ఫార్మాట్లో అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
JBL Live Beam 3 Price: జేబీఎల్ నుంచి సరికొత్త ఇయర్బడ్స్.. 48 గంటల ప్లేబ్యాక్ టైమ్!
తాజావార్తలు
-
Venkatesh Iyer: తమిళనాడు సీఎం విజయ్ స్టైల్ను దించేసిన వెంకటేశ్ అయ్యర్..
-
PM Modi: స్వీడన్లో మోడీకి ఘన స్వాగతం.. గ్రిపెన్ ఫైటర్ జెట్ల ఎస్కార్ట్ వైరల్
-
Drone Attack: అబుదాబిలో హై టెన్షన్.. అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ల దాడి.. అసలు ఏం జరిగిందంటే!
-
New Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఈ ప్రాంతాల మధ్య మరో కొత్త ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభం..
-
Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..