TG ICET Result: నేడు తెలంగాణ ఐసెట్ ఫలితాలు వెల్లడి.. ఎన్ని గంటలకంటే?
- నేడు టీజీసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలు
- ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల
- ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG ICET Result: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్-2024 ప్రవేశ పరీక్ష ఫలితాలను ఈరోజు అధికారులు ప్రకటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఫలితాలు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచబడతాయి. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే, ఈ పరీక్ష ఫలితాల ఆధారంగా రాష్ట్రంలోని యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో పూర్తిస్థాయి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్థులు ముందుగా ICET ర్యాంక్ కార్డ్ కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి- https://icet.tsche.ac.in/. హోమ్ పేజీలో ‘డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్’ లింక్పై క్లిక్ చేయండి. అక్కడ లాగిన్ పేజీలో అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ‘వ్యూ ర్యాంక్ కార్డ్’ బటన్పై క్లిక్ చేయాలి.
Also Read
- Minister Ponguleti: 22ఏ భూముల పరిష్కారానికి తుది గడువు.. అర్హులకు అన్యాయం జరగనివ్వం: మంత్రి పొంగులేటి
- School Holidays: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఆగస్టు నెలలో వరుస సెలవులు.. లిస్ట్ ఇదే..
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- Harish Rao: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై కుట్ర జరుగుతోంది.. హరీశ్రావు సంచలన ఆరోపణలు
Read also: Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై కేసు నమోదు!
వివరాలు నమోదు చేయగానే కంప్యూటర్ స్క్రీన్పై ISET ర్యాంక్ కార్డు కనిపిస్తుంది. అభ్యర్థులు ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో ఉపయోగం కోసం ఉంచండి. కాగా, జూన్ 5, 6 తేదీల్లో మూడు సెషన్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని 116 పరీక్షా కేంద్రాల్లో ఐసెట్-2024 ప్రవేశ పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే.దీంతో ఈ పరీక్షకు రెండు రాష్ట్రాల నుంచి 86,156 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 77,942 మంది విద్యార్థులు ఐసెట్ పరీక్షకు హాజరయ్యారు.
కాగా, మొత్తం హాజరు 90.47 శాతం. జూన్ 5న మొదటి సెషన్కు 115 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా 25,931 మంది హాజరయ్యారు. రెండో సెషన్లో 116 కేంద్రాల్లో 26,298 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. జూన్ 6వ తేదీ ఉదయం జరిగిన చివరి సెషన్లో 28,256 మంది విద్యార్థుల్లో 25,662 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే తెలంగాణలో 16 కేంద్రాలు, ఏపీలో 4 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షను నిర్వహించారు. తెలంగాణ ఐసెట్-2024 ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించారు.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
తాజావార్తలు
-
iTel Ace 3 Heera: రూ.949కే బెస్ట్ ఫీచర్ ఫోన్.. వాయిస్ అసిస్టెంట్, 13 రోజుల బ్యాటరీ.. ఇంకా..
-
US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
-
Pakistan Cricket Board: పాకిస్థాన్ ఆటగాళ్లకు షాక్.. వారిపై రెండేళ్ల పాటు నిషేధం..
-
UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
-
Yash Dhull: అద్భుత శతకంతో చెలరేగిన ఓపెనర్.. లీగ్లో రెండో సెంచరీ నమోదు..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!