Tension in Suryapet: తిమ్మారెడ్డిగూడెంలో ఉద్రిక్తత.. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tension in Suryapet: సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడిగూడెంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. తిమ్మారెడ్డిగూడెంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అయితే అక్కడకు వచ్చిన కళాకారులు జై భీమ్ అంటూ నినాదాలతో తిమ్మారెడ్డిగూడెం మారుమోగింది. కాగా అటునుంచి వెలుతున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి అక్కడున్న కళాకారుల దగ్గరకు వెళ్లి జై భీమ్ అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. శ్రీనివాసరెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ప్రశాంతంగా సాగుతున్న సభను అడ్డుకోవడం ఏంటని ఇది సరైన పద్దతి కాదని ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డిని మునగాల ఎస్సై లోకేష్ చెప్పారు. దీంతో అక్కడ గందగోళ పరిస్థితి నెలకొంది.కాగా.. అక్కడ పరిస్థితి చేయదాటడంతో పోలీసులు ఇరువుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
Read also: Jess Jonassen: బెస్ట్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న ఆస్ట్రేలియా క్రికెటర్
Also Read
- Robbery: భారీ దోపిడీ కేసు ఛేదించిన పోలీసులు.. కిలో బంగారం, వెండి స్వాధీనం.. ఒకే కుటుంబంలో నలుగురు దొంగలు..
- Telangana Govt: గుడ్న్యూస్.. జూన్ 2 నుంచి మరో పథకం ప్రారంభం.. వారికి రూ.5 లక్షల వరకు..
- KTR: "మీ గల్లీ కేసీఆర్ మీరే కావాలి".. అలాంటి వాళ్లకే కార్పొరేట్ టికెట్ ఇస్తామన్న కేటీఆర్..
- Hyderabad: పసిబిడ్డతో వెళ్తున్న మహిళపై కామాంధుడి వికృత చేష్టలు.. ఇంకొకడు ఇలాంటి పని చేయాలంటే వణుకు పుట్టేలా..
అయితే ఎస్సై లోకేష్ తనపై దాడి చేశాడంటూ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి నిరసనగా శ్రీనివాస్ రెడ్డి వర్గం ఆందోళన చేపట్టింది. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. ఎంపీటీసీపై పోలీసులు దాడిచేయడం ఏంటి? అని ప్రశ్నించారు. నేను ఏ సభను అడ్డుకోలేదని పోలీసులే కావాలనే తనపై దాడి చేశారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సభ నిర్వహించారని, అక్కడి నుంచి వెళుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, తనను ఎస్సై లోకేష్ అడ్డుకున్నారని తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నిస్తే మాపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే… అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కాన్వాయ్ ను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సీఐ జోక్యంతో అక్కడ నుంచి ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెళ్లిపోయారు. అయితే.. తాను ఎవరిపై దాడి చేయలేదని మునగాల ఎస్సై లోకేష్ వివరణ ఇచ్చారు. సభను అడ్డుకోవడంతోనే అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొందని పేర్కొన్నారు.
Kedar Jadhav : ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్..
తాజావార్తలు
-
RR VS MI: ప్లే ఆఫ్స్లోకి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్.. మే 27న SRH తో ఎలిమినేటర్ మ్యాచ్..
-
Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
-
Viral: ఫుడ్ పాయిజనింగ్కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
-
Yuvraj Singh: మీ అందరినీ చెప్పులతో కొట్టాల్సిన సమయం వచ్చేసింది.. పంజాబ్ ఆటగాళ్లపై విరుచుకుపడ్డ యూవీ.!
-
Rohit Sharma: ఐపీఎల్ చరిత్రలోనే.. చెత్త రికార్డు మూట గట్టుకున్న రోహిత్ శర్మ..
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!