Srinivas Goud: హెచ్సీఏకి స్ట్రాంగ్ వార్నింగ్.. తెలంగాణ పరువు తీస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Sports Minister Srinivas Goud Gives Strong Warning To HCA: ఈనెల 25వ తేదీన ఉప్పల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకం విషయంపై తెలంగాణ క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. మ్యాచ్ టికెట్ల అవకతవకలపై విచారణ జరుపుతామని.. ఒకవేళ టికెట్లు బ్లాక్లో అమ్మినట్టు తేలితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ అసోసియేషన్ ఉన్నది కేవలం పది మంది అనుభవం కోసం కాదని, ఉప్పల్ స్టేడియం కోసం ప్రభుత్వం 23 ఎకరాలు ఇచ్చిన విషయాన్ని గుర్తించుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరిస్తే.. సీఎం కేసీఆర్ సహించరని హెచ్చరించారు.
టికెట్ల విక్రయాలు పారదర్శకంగా జరగాలని.. టికెట్స్ అమ్మకాలపై క్రీడాశాఖ, పోలీస్ శాఖలు నిఘా ఉంచాయని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు రేపు ఉప్పల్ స్టేడియాన్ని తాను పరిశీలిస్తానని అన్నారు. టికెట్స్ బ్లాక్ దందా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. తెలంగాణ పరువు తీస్తే ఏమాత్రం సహించేదే లేదని తెగేసి చెప్పారు. స్టేడియం సామర్థ్యం ఎంత? ఎన్ని టికెట్లు అమ్మారనే దానిపై తాము లెక్కలు తేల్చుతామని స్పష్టం చేశారు. మ్యాచ్ టికెట్ల అమ్మకంపై అన్ని వివరాలు చెప్పాలని హెచ్ సీఏని సూచించారు. కాగా.. ఈ మ్యాచ్ టికెట్ల కోసం ప్రేక్షకులు జిమ్ఖానా గ్రౌండ్స్ వద్ద ఏ స్థాయిలో తరలివచ్చారో అందరికీ తెలిసిందే! ఈ నేపథ్యంలోనే టికెట్ల అవకతవకలు జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవ్వడంతో, క్రీడామంత్రి శ్రీనివాస్ గౌడ్ పైవిధంగా సీరియస్ అయ్యారు.
Also Read
తాజావార్తలు
-
UCC Bill: ‘ఒక్క పెళ్లి చేసుకున్నవారికే రాష్ట్రంలో ఉండే హక్కు ఉంటుంది’.. సీఎం సంచలన ప్రకటన..
-
CM Chandrababu : అమరావతి దేవతల రాజధాని.. నవ్యాంధ్రను నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం
-
Success Story: 20 గంటల పోలీసు డ్యూటీ, గర్భం, రెండు వైఫల్యాలు..అయినా ఒక రైతు కూతురు డీఎస్పీ అయింది..
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!