చెన్నమనేని పౌరసత్వ వివాదం కేసులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు.. ఇవాళ్టి హైకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరపున అస్సిటెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హాజరయ్యారు.. ఇదే సమయంలో… బుక్ లెట్ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు… 2019 వోసీఐ కార్డ్ బెర్లిన్ లో ఇండియన్ అంబసి ద్వారా చెన్నమనేని తీసుకున్నాడని కోర్టుకు వివరించారు.. వోసీఐ దరఖాస్తు ఫామ్ 10 కాలంలో నేషనాలిటీ జర్మనీ అని పెట్టాడని కోర్టుకు తెలియజేశారు.. చెన్నమనేని రమేష్ బాబు.. వోసీఐ కార్డ్ మీద ఇండియాకు వచ్చి జర్మనీ పాస్పోర్ట్ మీద జర్మనీకి వెళ్తున్నట్టు తెలిపారు.
ఇక, 2009 భారత దేశ పౌరసత్వం పొందినప్పుడు 2013 వరకు జర్మనీ పాస్ పోర్ట్ కాలపరిమితి ఉండే.. అతను భారతీయుడు అయితే 2013లో జర్మనీ పాస్ పోర్ట్ ను 2023 వరకు ఎలా రెన్యూవల్ చేసుకుంటాడని వాదనలు వినిపించారు రవికిరణ్… ఇండియన్ అయితే ఇండియా పాస్ పోర్ట్ మీదనే ప్రయాణం చేయాలి.. కానీ, జర్మనీ పాస్ పోర్ట్ మీదనే ప్రయాణాలు చేస్తున్నాడని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, మీ వోసీఐ కార్డులోనే జర్మనీ నేషనలిటీ అని ఎలా రాశారని ప్రశ్నించింది హైకోర్టు.. ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొంది హైకోర్టు.. కాగా, తమ పిటిషనర్ చెన్నమనేనితో సంప్రదించి పూర్తి వాదనలు వినిపిస్తాయని చెన్నమనేని తరపు న్యాయవాది తెలపడంతో.. తదుపరి విచారణను ఆగస్టు 24వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.