Site icon NTV Telugu

DGP Shivadhar Reddy :FSL ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై విచారణ చేస్తున్నాం..

Shivadhar Reddy

Shivadhar Reddy

Telangana FSL Fire Accident : తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో ఇటీవల సంభవించిన అగ్నిప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ ప్రమాదంలో కీలకమైన కేసులకు సంబంధించిన ఆధారాలు కాలిపోయాయనే అనుమానాల నేపథ్యంలో, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ప్రమాదానికి గల కారణాలు, జరిగిన నష్టం, కేసుల విచారణ ఏ దశలో ఉందనే విషయాలపై ఆయన స్పష్టతనిచ్చారు.

Yogi Adityanath: “బాబ్రీ మసీదు” ఎప్పటికీ నిర్మితం కాదు.. వారి కలలు నిజం కావు..

ఈ అగ్నిప్రమాదంలో ఎఫ్ఎస్ఎల్ లోని సర్వర్ రూమ్‌లు పూర్తిగా కాలిపోయాయని డీజీపీ వెల్లడించారు. అత్యంత విచారకరమైన విషయం ఏమిటంటే, ఈ సర్వర్లకు ఎటువంటి బ్యాకప్ వ్యవస్థ అందుబాటులో లేదు. “సర్వర్ రూమ్ పూర్తిగా దగ్ధమైంది. డేటా బ్యాకప్ లేకపోవడం వల్ల కొంత సమాచారం కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే, ప్రస్తుతం సాంకేతిక నిపుణుల బృందం రంగంలోకి దిగి, కాలిపోయిన సర్వర్ల నుండి డేటాను తిరిగి వెలికితీసే (Retrieve) ప్రయత్నాలు చేస్తోంది” అని ఆయన వివరించారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.

ప్రమాదం జరిగిన సమయంలో కొన్ని కీలక కేసుల ఆధారాలు మాయమయ్యాయనే ప్రచారాన్ని డీజీపీ కొట్టిపారేశారు. ముఖ్యంగా 2015 నాటి ఏసీబీ కేసుల (ఓటుకు నోటు వంటివి) గురించి ప్రస్తావిస్తూ, ఆ కేసులకు సంబంధించిన సాక్ష్యాధారాలను తాము 2021లోనే కోర్టుకు సమర్పించామని స్పష్టం చేశారు. అందువల్ల ఇప్పుడు జరిగిన ప్రమాదానికి, ఆనాటి కేసుల ఆధారాలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా, రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కూడా ఆయన స్పందించారు. ఈ కేసులో కావాల్సిన అన్ని అంశాలను ఇప్పటికే నిశితంగా పరిశీలించామని, దానికి సంబంధించిన నివేదికలను ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేశామని తెలిపారు.

కొత్త కలర్, స్పోర్టీ స్టైల్, భారీ తగ్గింపు ధరతో 2026 Aprilia RS 457, Tuono 457 బైక్స్ లాంచ్.!

Exit mobile version