డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్స్ దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయించారు. దోస్త్ పరిధిలో 950 డిగ్రీ కళాశాలలు.. 501 కోర్సులు, 4 లక్షల 8 వేల 345 సీట్లు ఉన్నాయి. అయితే మొత్తం 27 డిగ్రీ కళాశాలల్లో జీరో అడ్మిషన్స్. ఇక కేటాయించిన సీట్లలో మహిళలకే ఎక్కువ సీట్లు వచ్చాయి. మొత్తం లక్షా 67 వేల 130 మందికి సీట్ల కేటాయింపులో పురుషులు 78 వేల 21మంది… మహిళలు 89 వేల 109 మంది ఉన్నారు. ఆప్షన్స్ ఎక్కువగా పెట్టుకోక పోవడంతో 14 వేల 508 మంది సీట్లు పొందలేక పోయారు. ఆర్ట్స్ లో 22 వేల 594 మందికి… కామర్స్ లో 65 వేల 897 మంది కి, లైఫ్ సైన్సెస్ లో 33 వేల 17 మందికి, డేటా సైన్సెస్ 3 వేల 273 మందికి, పిజికల్ సైన్సెస్ లో 35 వేల 731 మందికి సీట్ల కేటాయించారు.
అయితే డిగ్రీ లో కామర్స్ కోర్సునే ఎంపిక చేసుకున్నారు ఎక్కువ మంది విద్యార్థులు. దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు 2లక్షల 6 వేల 44 మంది కాగా వెబ్ ఆప్షన్స్ లక్షా 81 వేల 638 మంది విద్యార్థులు ఇచ్చుకున్నారు. ఇక ఇంగ్లీష్ మీడియం లో లక్ష 47 వేల 36 మంది, తెలుగు మీడియంలో 18 వేల 889 మంది, ఉర్దూ మీడియం లో 11 వందల 92 మంది, హిందీ మీడియం లో 13 మంది కి సీట్లు వచ్చాయి.
