Site icon NTV Telugu

తెలంగాణలో 109 కొత్త‌గా క‌రోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 20,576 శాంపిల్స్‌ పరీక్షించగా… 109 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ఈరోజు క‌రోనా కార‌ణంగా ఒక‌రు మ‌ర‌ణించారు.

https://ntvtelugu.com/three-more-new-omicron-cases-in-telangana/

ఇదే సమయంలో 190 మంది కోవిడ్‌ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,80,662 కు చేరుకోగా… రికవరీ కేసులు 6,73,223 కు పెరిగాయి.. ఇక, మృతుల సంఖ్య 4,022 కు చేరినట్టు బులెటిన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 3,417 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Exit mobile version