తెలంగాణ కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. గత బులెటిన్తో పోలిస్తే.. తాజా బులెటిన్లో కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 80,568 శాంపిల్స్ పరీక్షించగా… 339 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో ఇద్దరు కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 417 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్.. దీంతో… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,794కు పెరగగా.. రికవరీ కేసులు.. 6,46,761కు చేరాయి.. ఇక, మృతుల సంఖ్య 3,867కు పెరిగింది.. ప్రస్తుతం 6,166 యాక్టివ్ కేసులు ఉన్నట్టు సర్కార్ వెల్లడించింది. తాజా కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 91 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ కరోనా అప్డేట్.. కాస్త తగ్గిన కేసులు..

COVID 19