Bharat Jodo Yatra: 7న తెలంగాణలో ముగియనున్న యాత్ర.. ఆరోజు భారీ బహిరంగ సభ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress Party Planning A Huge Public Meeting On November 7: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈనెల 7వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. మెనూరులో పెద్దఎత్తున చారిత్రాత్మక బహిరంగ సభను నిర్వహించనున్నామని.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి వికృమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్టోబర్ 23న కర్ణాటక నుంచి తెలంగాణలోని మక్తల్లో భారత్ జోడో యాత్ర అడుగుపెట్టిందని.. 27వ తేదీ నుంచి ఈ యాత్ర వరుసగా సాగిందన్నారు. ఈ యాత్రకు తెలంగాణ ప్రజల నుంచి అద్భుతమైన మద్దతు లభించిందన్నారు.
ఈ పాదయాత్రలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్దయెత్తున పాల్గొని.. రాహుల్ గాంధీకి సంఘీభావం ప్రకటించారన్నారు. అనేక సామాజిక కార్యకర్తలు, కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్య వాదులు, మహిళ సాధికారిత కార్యకర్తలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, చిన్న పిల్లలు.. ఇలా అనేక వర్గాలవారు రాహుల్ గాంధీని కలిసి, తమ సమస్యలను వివరించారన్నారు. అందుకు రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించి, వారిని అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారన్నారు. నవంబర్ 7వ తేదీన ఈ యాత్ర తెలంగాణలో ముగిసి.. ఆ రోజు రాత్రి మహారాష్ట్రలో అడుగుపెడుతుందన్నారు. ఈ యాత్రను విజయవంతం చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇన్నిరోజులు ఎలాగైతే ఈ యాత్రకు మద్దతు తెలిపారో.. అలాగే 7వ తేదీన జరిగే చివరి సభకు కూడా ప్రజలు భారీగా తరలివచ్చి, రాహుల్కు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.
Also Read
- Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్కు చెక్..
- Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
- Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
తాజావార్తలు
-
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!