Revanth Reddy: నేడు సమీక్షకు సీఎండీని పిలవండి.. రూ.85 వేల కోట్లు బకాయిలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరింది.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత తొలి కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందుగా విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ పనితీరుపై చర్చ జరిగి.. విద్యుత్ శాఖలో ఏం జరిగిందో వివరిస్తూ సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇంతకాలం ఆ శాఖలో నిజానిజాలు బయటపెట్టడం లేదంటూ ఆ శాఖ ఉన్నతాధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభం తెచ్చేందుకు కుట్ర పన్నారని సీఎం రేవంత్ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్ సంస్థలకు ఇప్పటి వరకు రూ.85 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని అధికారులు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై నేడు సమీక్షిస్తానని చెప్పి ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని రేవంత్ ఆదేశించినట్లు సమాచారం. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారని.. దానిని ఆమోదించకుండా ఇవాళ (శుక్రవారం) సమీక్ష సమావేశానికి పిలవాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ శాఖపై ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు.
Read also: Congress : తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్పై కాంగ్రెస్ ‘గ్యారెంటీలు’ ఎంత భారంగా మారనున్నాయి?
Also Read
- Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!
- Mutyam Venkataramana: ఆదాయానికి మించిన ఆస్తులు.. ట్రాన్స్కో డీఈ అరెస్టు.! రూ.400 కోట్ల ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు.!
- CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
- HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
కేబినెట్ భేటీలో ఆరు హామీల చట్టంపై సుదీర్ఘ చర్చ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రజలకు మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపిందని.. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిసెంబర్ 7న అన్ని శాఖల వివరాలపై చర్చ జరిగిందని తెలిపారు. 2014 నుంచి డిసెంబర్ 2023 వరకు అన్ని శాఖల నిధుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను కోరారు.ఆరు హామీల్లో రెండు హామీలను అమలు చేయాలని నిర్ణయించారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రెండు హామీల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రైతులకు, పరిశ్రమలకు 24 గంటల కరెంటు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. 2014 నుంచి గత ప్రభుత్వం కరెంటులో అనేక తప్పులు, సమస్యలు, ప్రణాళిక లేకుండా ఆలోచించిందని.. నేడు విద్యుత్పై సీఎం సమీక్షిస్తారని చెప్పారు. ప్రజలకు అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందించాలని కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని తెలిపారు. 9వ తేదీన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందన్నారు.
Read also: Astrology: డిసెంబర్ 08, శుక్రవారం దినఫలాలు
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!