Site icon NTV Telugu

Bullet Train : తెలుగు రాష్ట్రాల్లో బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌లకు కీలక మార్పులు

Bullet Train

Bullet Train

Bullet Train : హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌ల ప్రతిపాదనల్లో మార్పులు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రైల్వే శాఖను కోరింది. సెప్టెంబర్‌ 11న రైల్వే అధికారులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రెండు కారిడార్ల కలిపి అంచనా వ్యయం సుమారు రూ. 3.30 లక్షల కోట్లుగా ఉన్నట్లు సమాచారం.

హైదరాబాద్‌–చెన్నై రూట్‌లో మార్పు

రైల్వే ప్రతిపాదన: హైదరాబాద్‌ నుంచి విజయవాడ నేషనల్‌ హైవే మార్గంలో (నార్కట్‌పల్లి, సూర్యాపేట, ఖమ్మం) మీదుగా చెన్నైకి రైలు మార్గం.

ప్రభుత్వ సూచన: శంషాబాద్‌ నుంచి మిర్యాలగూడ వైపు అమరావతి వరకు వస్తున్న కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పక్కన రైలు లైన్‌ వేయాలని అభ్యర్థన.

సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయం ప్రకారం, కొత్త హైవే పక్కన రైలు మార్గం వేసే అవకాశం ఉంటే నిర్మాణ ఖర్చు, సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ మార్గానికి అంచనా వ్యయం రూ. 1.86 లక్షల కోట్లు. జీఎం ఆమోదం వచ్చిన తర్వాతే సర్వే ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌–బెంగళూరు కారిడార్‌

ప్రభుత్వ ప్రతిపాదన: శ్రీశైలం మీదుగా హైస్పీడ్‌ రైలు లైన్‌ వేయాలి. ఎందుకంటే, ఇప్పటికే అక్కడ ఎలివేటెడ్‌ కారిడార్‌తో నేషనల్‌ హైవే ప్రాజెక్ట్‌ ముందుకు వెళ్తోంది.

రైల్వే అభిప్రాయం: శ్రీశైలం మార్గం ఖర్చుతో కూడుకున్నదని అధికారులు భావిస్తున్నారు.

ఈ కారిడార్‌కు అంచనా వ్యయం రూ. 1.44 లక్షల కోట్లు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక/తమిళనాడు రాష్ట్రాల మీదుగా నిర్మితమయ్యే ఈ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులు పూర్తయితే, ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది.

 

Exit mobile version