Site icon NTV Telugu

ముస్లింలకు కూడా మోడీ పథకాలు అందుతున్నాయి..

ఇది గోల్కొండ కాదు గొల్లకొండ. గొల్లకొండ కోట మీద కాషాయ జండా ఎగురవేస్తాం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాత బస్తికి రావాలి అంటే అనుమతి కావాలా అని ప్రశ్నించారు. నిన్న బాగ్య లక్ష్మీ దేవాలయం దగ్గర సభ పెట్టాము… మళ్ళీ పెడతాం. నరేంద్ర మన మీద పెట్టి పోయిన బాధ్యతలు మనము పూర్తి చేద్దాం. నిన్న నరేంద్ర దగ్గరికి నేడు బద్దం బాల్ రెడ్డి దగ్గరకు వచ్చాను. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదు. కానీ హిందువులకు అన్యాయం జరిగితే ఊరుకొము. త్రిబుల్ తలాక్ మూర్ఖత్వపు విధానాన్ని పీఎం మోడీ తొలగించారు. మోడీ పథకాలు కేవలం హిందువులకే ఇవ్వడం లేదు. ముస్లింలకు కూడా పథకాలు అందుతున్నాయి అని తెలిపారు.

తెలంగాణ ను వ్యతిరేకించిన ఎంఐఎం తో కేసీఆర్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఎంఐఎం గుండాల చేతిలో అశువులు బాసిన పాపన్న, నందరాజ్ గౌడ్ ల త్యాగం వృధా పోనియ్యం. హుజూరా బాద్ లో గెలిచేది ఈటల రాజేందరే అని పేర్కొన్నారు.

Exit mobile version