YS Sharmila: చంద్రబాబు ఇంటికి షర్మిల.. వైఎస్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Sharmila: హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకురాలు షర్మిల ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్లను కూడా ఆహ్వానించారు. కాగా, షర్మిల తనయుడు రాజా రెడ్డికి ప్రియా అట్లూరితో ఈ నెల 18న నిశ్చితార్థం జరిగి ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న విషయం తెలిసిందే. చంద్రబాబును పెళ్లి ప్రతిక ఇచ్చి ఆహ్వానించామని అన్నారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని చంద్రబాబు పంచుకున్నారన్నారనిషర్మిల అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చంద్రబాబు కుటుంబానికి కేక్ పంపినట్లు ఆమె తెలిపారు. లోకేష్ తనకు బహుమతి కూడా పంపారని ఆమె గుర్తు చేశారు. చంద్రబాబు పెళ్లికి తప్పకుండా హాజరవుతానని చెప్పారని అన్నారు. చంద్రబాబుని సాధారణంగా చూడాలని అన్నారు. ఫ్రెండ్లీ గా ఉండాలన్నారు. రాజకీయాలు మా ప్రొఫెషన్.. జీవితాలు కాదన్నారు. ఒకరినొకరు మాటలు అనుకుంటాం.. రాజకీయంగా బాబుకు మాకు లావాదేవీలు ఉండవన్నారు. రాజకీయాలు ఫ్రెండ్లి గా ఉండాలని షర్మిల అన్నారు.
Read also: Bangladesh Cricket Board: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా
Also Read
- Job Notification: నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. 12,256 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని.. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు ప్రముఖులు స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేస్తున్నారు. తాజాగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి.. తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నారు. కాబోయే వధూవరులను కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ను కలిసి పెళ్లికి ఆహ్వానించారు. తర్వాత ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్లో చేరారు. కుమారుడి పెళ్లి తర్వాత షర్మిల రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది. వైఎస్సార్టీపీ కాంగ్రెస్లో విలీనమైన నేపథ్యంలో అధిష్టానం ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమిస్తారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Uddhav Thackeray: కాలారామ్ ఆలయంలో హారతికి రావాలని రాష్ట్రపతికి ఉద్దవ్ ఠాక్రే ఆహ్వానం..
తాజావార్తలు
-
CSK Vs GT: చెన్నైపై గుజరాత్ టైటాన్స్ వీర బాదుడు.. ముగ్గురు బ్యాట్స్మెన్స్ హాఫ్ సెంచరీలు.. టార్గెట్ ఎంతంటే..
-
New York Floods: న్యూయార్క్లో ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన మహిళ.. వీడియో వైరల్
-
CM Chandrababu : గోవా ప్లస్గా సూర్యలంక బీచ్.. త్వరలో బాపట్ల మాస్టర్ ప్లాన్
-
BJP: 20 ఏళ్లు బీజేపీదే హవా, కాంగ్రెస్ కష్టమే: యాక్సిస్ మై ఇండియా చీఫ్..
-
China Floods: భారత్లో ఎండలు.. చైనాలో వరదలు.. ముంచెత్తిన భారీ వర్షాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!