హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్ లపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేసారు. వెస్ట్ జోన్, నార్త్ జోన్, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి ఈ దాడులు చేసారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, మహంకాళి, ఖర్కనా , మరెడ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో ఉన్న అన్ని స్పా లపై దాడులు జరిపారు పోలీసులు. మసాజ్ సెంటర్ల ముసుగులో నిభందనలకు విరుద్ధంగా క్రాస్ మసాజ్ కు పాల్పడుతున్నారు పలువురు స్పా నిర్వాహకులు. దాంతో ఈ దాడులలో 33 మందిని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ దాడులలో పలువురు నిర్వాహకులు, మహిళ ఉద్యోగులు, కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.