Ruby Hotel Fire Accident: ఆ నలుగురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Task Force Police Arrested 4 Members In Ruby Hotel Fire Accident: సికింద్రాబాద్లోని రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్లో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే! ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజమాని రాజేందర్ సింగ్ బగ్గా, ఆయన కుమారుడు సునీత్ సింగ్ బగ్గా, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్ను అరెస్ట్ చేశారు. హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకోవడానికి ముందు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో.. రూబీ ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ని తండ్రికొడుకులు రాజేందర్ సింగ్, సునీత్ సింగ్ మూసివేసి.. కార్ఖానాలోని తమ ఇంటికి వెళ్లిపోయారు. 9:45 గంటల సమయంలో హోటల్లో అగ్ని ప్రమాదం సంభించిందని.. హోటల్లో పని చేసే సిబ్బంది రాజేందర్ సింగ్కు సమాచారం అందించారు.
అప్పుడు రాజేందర్ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ఫైర్ యాక్సిడెంట్లో 8 మంది చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన, అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ.. భవన యజమానితో పాటు రూబీ ఎలక్ట్రికల్ షోరూం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్పటికే హోటల్ను సీజ్ చేశారు. అయితే.. వాళ్లు పరారీలో ఉన్నారని తెలిసి, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వాళ్లు కిషన్ బాగ్లో తలదాచుకున్నారన్న విషయం పోలీసులకు తెలిసిందే! దీంతో వెంటనే అక్కడికి చేరుకొని.. తలదాచుకున్న రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్లను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు హోటల్ మేనేజర్, సూపర్ వైజర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Uber: గుడ్ న్యూస్.. హైదరాబాద్ లో ఉబెర్ సంస్థ భారీ విస్తరణ..
- Former Maoist leader: 42 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థిగా మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్జీ.. ఇంటర్ పరీక్షకు సిద్ధం!
- Hyderabad: మరోసారి నేపాలీ గ్యాంగ్ హల్చల్.. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి, పక్కా ప్లాన్తో దోపిడీ!
- Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్లో ఏముంది?
కాగా.. భవన నిర్మాణ లోపాలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణలో పొరపాట్లు, అంతకుమించిన నిర్లక్ష్యమే ఈ అగ్ని ప్రమాదంలో 8 మంది ఆహుతి అయినట్లు తేలింది. ఫోమ్ సిలిండర్ ద్వారా ఆపేందుకు ప్రయత్నిస్తే, అది కొన్ని సెకన్లే పని చేసింది. ఆ తర్వాత ఆ పరికరం పని చేయలేదు. అసలు ఆ భవనానికి నిప్పును ఆర్పే వ్యవస్థే లేదని తెలిసింది. దీనికితోడు హోటల్లో ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఒకటే. సెల్లార్ను కూడా పార్కింగ్ కోసం కాకుండా వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. జీ+3 అంతస్తులకి అనుమతి ఉంటే, అక్రమంగా మరో రెండు అంతస్తుల్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఈ హోటల్ని సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Mythri Ravi: ముగ్గురిదీ ఒకే సమస్య: మైత్రీ రవి
-
Keralam: కేరళం సీఎం ఎంపికపై తర్జనభర్జన.. నిర్ణయం రేపటికి వాయిదా
-
AIADMK: ముదిరిన అన్నాడీఎంకే సంక్షోభం.. విజయ్కు మద్దతు ఇచ్చిన నేతలపై వేటు..
-
Tollywood Exclusive: కోడి ముందా, గుడ్డు ముందా అంటే గుండె ఆగాల్సిందే!!
-
Karnataka: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. పాఠశాలల్లో హిజాబ్, జంధ్యాలు ధరించేందుకు అనుమతి
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!