Ruby Hotel Fire Accident: ఆ నలుగురిని అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Task Force Police Arrested 4 Members In Ruby Hotel Fire Accident: సికింద్రాబాద్లోని రూబీ హోటల్ ఫైర్ యాక్సిడెంట్లో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే! ఈ కేసులో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ యజమాని రాజేందర్ సింగ్ బగ్గా, ఆయన కుమారుడు సునీత్ సింగ్ బగ్గా, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్ వైజర్ను అరెస్ట్ చేశారు. హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకోవడానికి ముందు సోమవారం రాత్రి 9 గంటల సమయంలో.. రూబీ ఎలక్ట్రికల్ బైక్ షో రూమ్ని తండ్రికొడుకులు రాజేందర్ సింగ్, సునీత్ సింగ్ మూసివేసి.. కార్ఖానాలోని తమ ఇంటికి వెళ్లిపోయారు. 9:45 గంటల సమయంలో హోటల్లో అగ్ని ప్రమాదం సంభించిందని.. హోటల్లో పని చేసే సిబ్బంది రాజేందర్ సింగ్కు సమాచారం అందించారు.
అప్పుడు రాజేందర్ సింగ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ఫైర్ యాక్సిడెంట్లో 8 మంది చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన, అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ.. భవన యజమానితో పాటు రూబీ ఎలక్ట్రికల్ షోరూం యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్పటికే హోటల్ను సీజ్ చేశారు. అయితే.. వాళ్లు పరారీలో ఉన్నారని తెలిసి, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వాళ్లు కిషన్ బాగ్లో తలదాచుకున్నారన్న విషయం పోలీసులకు తెలిసిందే! దీంతో వెంటనే అక్కడికి చేరుకొని.. తలదాచుకున్న రాజేందర్ సింగ్, ఆయన కుమారుడు సునీత్ సింగ్లను అరెస్ట్ చేశారు. వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు హోటల్ మేనేజర్, సూపర్ వైజర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read
- Governor Abdul Nazeer: డిప్యూటీ సీఎంను ఇంటికెళ్లి పరామర్శించిన గవర్నర్.. పవన్ కల్యాణ్ లైబ్రరీ సందర్శన..
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
కాగా.. భవన నిర్మాణ లోపాలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణలో పొరపాట్లు, అంతకుమించిన నిర్లక్ష్యమే ఈ అగ్ని ప్రమాదంలో 8 మంది ఆహుతి అయినట్లు తేలింది. ఫోమ్ సిలిండర్ ద్వారా ఆపేందుకు ప్రయత్నిస్తే, అది కొన్ని సెకన్లే పని చేసింది. ఆ తర్వాత ఆ పరికరం పని చేయలేదు. అసలు ఆ భవనానికి నిప్పును ఆర్పే వ్యవస్థే లేదని తెలిసింది. దీనికితోడు హోటల్లో ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు ఒకటే. సెల్లార్ను కూడా పార్కింగ్ కోసం కాకుండా వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు. జీ+3 అంతస్తులకి అనుమతి ఉంటే, అక్రమంగా మరో రెండు అంతస్తుల్ని నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఈ హోటల్ని సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Jagan 2.0 Super App: జగన్ 2.0 సూపర్ యాప్ ఆవిష్కరణ.. పోలీసు కేసుల నుంచి పార్టీ సమావేశాల వరకు అన్నీ..
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు కోయెల్ మల్లిక్ రాజీనామా
-
OnePlus: ఇండియాను వదిలి వెళ్లి పోతున్న వన్ ప్లస్..? క్లారిటీ..
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు.. మిషన్ 360పై మోడీ సర్కార్ ఫోకస్..
-
Hair Growth Tips: జుట్టు గుత్తులు గుత్తులుగా రాలిపోతోందా?.. ఈ చిట్కాలు చాలు..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!